జాతీయంలైఫ్ స్టైల్

మందుబాబులకు విజ్ఞప్తి… సేవించే సమయంలో ఈ ఆహారం తప్పనిసరి!..

క్రైమ్ మిర్రర్, న్యూస్ :- ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మద్యం సేవించి వ్యక్తులు పెద్ద సంఖ్యలో చేరిపోయారు. పెద్దవారు లేదా చిన్న వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మద్యానికి బానిసవుతున్నారు. ఒకసారి ముందుకు అలవాటు పడ్డారంటే కచ్చితంగా వారు జీవితాంతం కూడా మధ్యాన్ని సేవిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రస్తుతం ఆల్కహాల్ తాగడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది మద్యం తాగి అనారోగ్యం పాలై చనిపోయిన వారి సంఖ్య కూడా చాలానే ఉంది. ఆల్కహాల్ తాగడం అంటేనే ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. ఆఫీసులో పార్టీలు అంటూ, ఇంట్లో పెళ్లి వేడుకలు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆల్కహాల్ వైపు మొగ్గు చూపుతున్నారు. పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సెలవు దొరికిన రోజు కచ్చితంగా మందు తాగాలి అని ఫిక్స్ అవుతుంటారు. అయితే బాడీ రిలాక్స్ కోసం కొంచెం మందు తాగడం మంచిదే అయినా కూడా ఎక్కువైతే మాత్రం డేంజర్ అంటున్నారు వైద్యాన్నిపుణులు.

ప్రస్తుతం మందు తాగే ప్రతి ఒక్కరు కూడా ఆల్కహాల్ సేవించే సమయంలో కొన్ని ఆహార పదార్థాలను జతగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆల్కహాల్ ను బ్యాలెన్స్ చేయవచ్చు అని. హ్యాంగోవర్ మరియు మత్తు వంటివి రాకుండా ఈ ఆహార పదార్థాలు అడ్డుకుంటాయి. కాబట్టి ఆల్కహాల్తో పాటుగా తినాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మద్యం తాగేటప్పుడు తృణధాన్యాలు కచ్చితంగా తీసుకోవాలి. తృణధాన్యాలు అంటే బ్రౌన్ రైస్, ఓట్స్, వీట్ బ్రెడ్ వంటివి స్నాక్స్ రూపంలో మద్యంతోపాటు ఆహారంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. కాబట్టి రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ ఒకేసారి విడుదల కాకుండా ఇవి అడ్డుకుంటాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే మద్యపానం చేసే సమయంలో ఒక అవకాడో పండును తినడం చాలా మంచిదని వైద్యు నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు జీర్ణం కావడానికి ఈ పండు చాలా సహాయపడుతుంది. ఇక ఆల్కహాల్ తాగిన వెంటనే స్ట్రాబెర్రీలు, నారింజ, ద్రాక్ష పనులు వంటివి తినాలి. అలాగే పాలకూర కాలే వంటి ఆకుకూరలతో చేసిన ఆహారాలను కూడా తీసుకోవడం చాలా మంచిది. బాదం, జీడిపప్పులు, వాల్నట్స్ మరియు చియా సీడ్స్ వంటివన్నీ కూడా మద్యంతో పాటు జతగా తినడం వల్ల శరీరానికి ఎంతో మంచిది. ఇవి ఆల్కహాల్ శోషణను మందగించేలా చేస్తాయి.

అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయి..రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు

కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ, కానిస్టేబుల్ స్పాట్ డెడ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button