Friday, March 20, 2026
Homeఆంధ్ర ప్రదేశ్అన్నదాతలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఎప్పుడంటే?

అన్నదాతలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఎప్పుడంటే?

Annadata Sukhibhava: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ పథకం అమలుపై అధికారులకు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగష్టు 2 నుంచి ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. అదే రోజు పీఎం కిసాన్ పథకం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 14 వేలు అందివ్వనుంది.

ఏడాదికి రైతుల ఖాతాలోకి రూ. 20 వేలు జమ

‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఏడాదికి రైతుకు రూ. 14 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఈ డబ్బులను మూడు విడుతలుగా అందివ్వనుంది. మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5,000 జమ చేయనుంది. ఆగస్టు 2న ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కారు వెల్లడించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లాభం జరగనుంది. ఇందుకోసం రూ.2,342.92 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

Read Also: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments