
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. మోడీ 3.0 ఏర్పడి నేటికీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ మీడియాలన్నీ కూడా చంద్రబాబు వైపే మొగ్గు చూపుతూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఎక్స్క్లూజివ్ అంటూ ప్రైస్ టైం లో ప్రసారం చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏ మాటలు మాట్లాడినా కూడా అది హెడ్లైన్స్ గా ప్రచారం చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు లోకల్ కాదు నేషనల్ లెవెల్ లో ఎదిగిపోయారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయంలో ఎత్తుకు పై ఎత్తు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు నాయుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుని అమరావతి రాజధానిని అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతున్నారు.
ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా కూడా ఎన్డీఏ విధానాలకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. మన భారతదేశానికి సరైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భారతదేశానికి అత్యంత బలవంతుడైన ప్రధానమంత్రి కావాలని… దానికి మారుపేరుగా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ఆ పాత్రకు సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో హిందీ భాష గురించి సంచలనంగా మారిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ హిందీ భాష విధానం చంద్రబాబు నాయుడు చాలా తెలివిని ప్రదర్శించి హిందీ నేర్చుకుంటే తప్ప ఏమీ లేదని తెలిపారు. దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న పనులకు నారా చంద్రబాబు నాయుడు 100కు 100% కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా రాజకీయం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అయినా కూడా ఇలాంటి మాటల్ని చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోవడం లేదు. కింగ్ మేకర్ అని ప్రతి ఒక్కరూ కూడా ఈ పదాన్ని మారు మ్రోగిస్తుంటే ఆయన మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఇలా జాతీయ మీడియా స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి మద్దతుగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
గాలి జైలుశిక్ష రద్దు, ఓబులాపురం మైనింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు!