అంతర్జాతీయం

డొనాల్డ్ ట్రంప్ పై అమెరికన్ల తిరుగుబాటు.. అగ్రరాజ్యంలో అలజడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ట్రంప్‌ పరిపాలన, వివాదాస్పద విధానాలపై అమెరికా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు వీధుల్లోకి వచ్చి ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. హ్యాండ్స్‌ ఆఫ్‌ పేరుతో నిరసనలు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై స్వదేశంలోనే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్‌తో పాటు బిలియనీర్ మస్క్‌ చర్యలపై అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ శనివారం వేలాది మంది నిరసనకారులు నార్త్ కరోలినాలోని షాలెట్‌ , మస్సాచుసెట్స్‌లోని బోస్టన్‌, వాషింగ్టన్‌ డీసీ సహా పలు చోట్ల భారీ నిరసనలు చేపట్టారు. “హ్యాండ్స్‌ ఆఫ్” పేరిట నిర్వహించిన ఈ నిరసనల్లో 150కి పైగా గ్రూపులు 1200మంది పాల్గొన్నారు. ఆందోళనకారుల్లో పౌర హక్కుల సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ట్రాన్స్‌జెండర్లు, న్యాయవాదులు, దివ్యాంగులు, నిపుణులు కూడా ఉన్నారు.

అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు తెలిపారు. హ్యాండ్స్‌ ఆఫ్‌ అంటూ 50 రాష్ట్రాలలో 1,200కిపైగా ప్రదేశాల్లో నిరసనలను నిర్వహించారు. ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలు సరిగా లేవని ప్రజల మాటలు వినిపించుకోకుండా వ్యవహరిస్తోందని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్ ప్రభుత్వం సరైన దిశలో నడవట్లేదని భారీ ఉద్యోగాల కోత వల్ల అమెరికాలో సేవలు, వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, సామాజిక భద్రత, మెడికైడ్, మెడికేర్, మాజీ సైనికుల హక్కులు, LGBTQ సమాజం ఇలా ప్రతి ఒక్కటి బెదిరింపులకు గురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా ట్రంప్ పరిపాలన విధానాలపై వీరు నిరసనలు తెలిపారు. ముఖ్యంగా సమాఖ్యల తొలగింపులు, సామూహిక బహిష్కరణలు, ఇతర వివాదాస్పద చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు మాట్లాడుతూ.. డొనాల్డ్‌ ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచానికే సవాల్‌ చేస్తున్నారని అన్నారు. వలసదారుల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థల తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కోతలు, వలసదారుల చికిత్స, లింగమార్పిడి హక్కులపై ఆంక్షలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక, 2017 తర్వాత అమెరికా ఇంత మంది బయటకు వచ్చి నిరసనలు ఇలా నిరసనలు తెలపడం ఇదే మొదటిసారి.


Also Read : గొలుసులతో కట్టి.. కుక్కల్లా నడిపించి – టార్గెట్‌ రీచ్‌కాని ఉద్యోగులకు శిక్ష..!


ఇదిలా ఉండగా అమెరికాలో ఉద్యోగాల కుదింపు కొనసాగుతోంది. తాజాగా ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది దాదాపుగా 25శాతంతో సమానం. శుక్రవారం నుంచే పౌర హక్కుల కార్యాలయం నుంచి ఈ తొలగింపును అధికారులు ప్రారంభించారు. ఆ కార్యాలయాన్ని మూసివేసి అక్కడి ఉద్యోగులను చీఫ్‌ కౌన్సెల్‌ కార్యాలయానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇక గత ఫిబ్రవరిలోనే 7,000 మంది తాత్కాలిక ఉద్యోగులను ఈ విభాగం నుంచి తొలగించారు.

ఈ నిరసనలపై. వైట్‌ హౌస్‌ స్పందించింది. సామాజిక భద్రత, మెడికేడ్‌లను ట్రంప్ ఎల్లప్పుడూ రక్షిస్తారని ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ట్రంప్ పరస్పర టారిఫ్‌ల నిర్ణయం వేళ ప్రపంచ కుబేరుడు, డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ కీలక విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా, ఐరోపా చాలా సన్నిహితమైన, బలమైన భాగస్వామ్యాన్ని సృష్టించగలవని పేర్కొన్నారు. ఎలాంటి పరస్పర పన్నులు లేని జీరో టారిఫ్ జోన్‌కు చేరుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటలీ లీగ్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ఓ వీడియోలింక్ ద్వారా మాట్లాడిన మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీ సచివాలయంలోని పవన్ కల్యాణ్ బ్లాక్ లో మంటలు

  2. అకడమిక్ క్యాలెండర్ విడుదల… సెలవులు దినాలు ఎప్పుడంటే?..

  3. హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. మునిగిపోవడం ఖాయమా?

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button