
హైదరాబాద్(క్రైమ్ మిర్రర్):-తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన అఘోరీ శ్రీనివాస్పై, తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది ఓ మహిళా.. రాణిగంజ్ బుద్ధ భవన్లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి కరీంనగర్ కు చెందిన ఓ మహిళ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసింది. అఘోరి శ్రీనివాస్ తనను పెళ్లి పేరుతో వాడుకుని వదిలేశాడంటూ, కమిషన్ ఎదుట భాదితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.. తన జీవితాన్ని శ్రీనివాస్ నాశనం చేశాడని, సోమవారం నాడు వర్షిణి అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.. అమాయక మహిళల జీవితాలతో ఇలా చెలగాటం ఆడుతున్న, అఘోరీ శ్రీనివాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.. పెళ్లైన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని అఘోరీ తనను బెదిరిస్తున్నాడని వాపోయింది. తనలాంటి మహిళలు చాలా మందిని అతను ఇలానే మోసం చేశాడని, అందరూ ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె బాధితులను కోరింది. తన వద్ద ఉన్న డబ్బులను తీసుకుని మానసికంగా హింసించాడని చెప్పింది.. కొన్ని సమస్యల పేరిట నగ్నపూజలు చేయిస్తానని చెప్పి, నగదు తీసుకుని తనను మోసం చేశాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.. కాగా 9.08 లక్షలు తీసుకుని మోసం చేశాడని, సదరు మహిళ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ మోకిలా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. 308, 301, 351, 352 బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు అన్నలు కలిసి వారు కూడా మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు.. వర్షిణినీ అఘోరి శ్రీనివాస్ నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని వారు ఆరోపించారు. అతని చెర నుంచి తమ కుమార్తెను ఎలాగైనా కాపాడి అప్పగించాలని వర్షిణి కుటుంబ సభ్యులు కోరారు.. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో అఘోరీ శ్రీనివాస్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం.. ఏదేమైనా అతని ఆగడాలను అరికట్టాలని పలువురు తెలుగు రాష్ట్రాల ప్రజలు, నాయకులు రెండు ప్రభుత్వాలను కోరుతున్నారు.