Wednesday, March 18, 2026
Homeఆంధ్ర ప్రదేశ్డౌట్ తో కంటైనర్ ను తెరవమన్న పోలీసులు!.. లోపల ఉన్నది చూస్తే షాక్ అవ్వాల్సిందే

డౌట్ తో కంటైనర్ ను తెరవమన్న పోలీసులు!.. లోపల ఉన్నది చూస్తే షాక్ అవ్వాల్సిందే

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో అక్రమ రవాణా ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా దగ్గర పోలీసులు ఒక కంటైనర్ లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో అ లారిని ఆపి చెక్ చేశారు. అందులో కనిపించినటువంటి సీన్ చూసి అందరూ కూడా షాక్ అయ్యారు. ఆ కంటైనర్ లారీలో లగేజ్ బదులుగా గోమాంసాన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ మాంసాన్ని కోల్కతా నుంచి చెన్నై తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 23 టన్నుల గోమాంసాన్ని తరలిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇక వెంటనే ఆ గోమాంసాన్ని స్వాధీనం చేసుకొని పరీక్షా కేంద్రానికి పంపించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రతిరోజు కూడా కేటుగాళ్లు యొక్క సొంత తెలివితేటలు మితిమీరిపోతున్నాయి. పోలీసులను బురిడీ కొట్టించి వివిధ రకాల లో అక్రమ రవాణాలను రాష్ట్ర సరిహద్దులను దాటేస్తున్నారు. మరి కొంతమంది తెలివితేటలు చూస్తే ప్రజలతో పాటు పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా ఉంటున్నాయి. తాజాగా ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

1.ట్రంప్‌కు షాక్.. అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్!

2.మంత్రి పదవి కోసం ఇల్లు మార్చిన రాజగోపాల్ రెడ్డి!

3.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మరోసారి ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడగింపు!!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments