
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :-వైసీపీ నేతలను వరుసబెట్టి అరెస్ట్ చేస్తున్నారు. గత ఐదేళ్లలో వారు చేసిన అవినీతి, అక్రమాలను.. తవ్వి తీస్తున్నారు. ఒక్కటి కూడా వదలకుండా కేసుల మీద కేసులు కడుతున్నారు. పోసాని, వల్లభనేని వంశీ, కాకాణిని అలానే చేశారు. ఇప్పుడు పేర్నినాని వంతు వచ్చిందా..? ఆయన అరెస్ట్ తప్పదా…? అంటే అవుననే అనాల్సి వస్తుంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన చుట్టూ ఇప్పటికే ఉచ్చు బిగించేశారు. పేర్నినాని మాత్రమే కాదు.. ఆయన కుమారుడు కిట్టు అరెస్ట్ కూడా తప్పేలాలేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీ, జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు పేర్నినాని. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు గట్టి కౌంటర్లు ఇచ్చేవారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే… ముందుగా పేర్నినాని టార్గెట్ చేశారు. పేర్నినాని ఆధ్వర్యంలో ఉన్న గోదాముల్లో నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారంటూ.. ఆయన భార్యపై కేసు నమోదు చేశారు. దీంతో… రెండు వారాల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది పేర్నినాని ఫ్యామిలీ. కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత వారు బయటకు వచ్చారు. ఇటీవల మళ్లీ ప్రెస్మీట్లు పెట్టి.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను దులిపిపడేస్తున్నారు. దీంతో… మళ్లీ ఆయన టార్గెట్ అయినట్టు ఉన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసు పెట్టి.. పేర్నినాని, ఆయన కుమారుడి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు.
గత ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పేర్నినానికి బదులు… ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి.. సీనియర్ నేత కొల్లు రవీంద్ర చేతిలో ఓడిపోయారు. అయితే.. ఎన్నికలకు ముందు… పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవన్నీ నకిలీ ఇళ్ల పట్టాలు అంటూ ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పుడు కేసు నమోదైంది. రాజకీయ లబ్దికోసం వేలాది మందిని మోసం చేశారంటూ… కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్నినానితోపాటు.. ఆయన కుమారుడు కిట్టు కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పేర్నినాని… నియోజకవర్గంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. త్వరలో ఏదైనా జరగొచ్చని… తాను అరెస్ట్ కావొచ్చని… రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ఆ సమావేశంలో చెప్పారు పేర్నినాని. దీంతో… త్వరలోనే ఆయన అరెస్ట్ కాబోతున్నారని తెలుస్తోంది.