
క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :- నాగుల పల్లి నుండి శంకర్ పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతీ హల్ చల్ చేసింది.
నాగులపల్లిలో స్థానికులు గమనించి కారు ను అడ్డుకున్నప్పటికీ పట్టాలపై వేగంగా కారు నడుపుతూ మహిళ హల్చల్ చేసింది.
రైలు పట్టాలపై హల్చల్ చేస్తున్న మహిళను గమనించిన రైలు పైలెట్ ట్రైన్ ను వెంటనే నిలిపివేశాడు.
పట్టాలపై మార్గమధ్యంలో ఆగిపోయిన ఈ రైలు వల్ల
గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే
సమాచారం అందుకున్న శంకరపల్లి పోలీసులు యువతి ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ మహిళ ఇలా ఎందుకు చేసిందో కారణం మాత్రం ఇంకా తెలియలేదు. పోలీసులు దీనిపై విచారణ చేయనున్నారు.
మందుబాబులకు విజ్ఞప్తి… సేవించే సమయంలో ఈ ఆహారం తప్పనిసరి!..
అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయి..రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు