తెలంగాణ

ఉత్తమ సేవలకు దక్కిన అరుదైన గౌరవం

క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి :- వృత్తిలో ఉత్తమ సేవలందించినందుకు గాను ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది. 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పోలీస్ మెడల్ గ్యాలంట్రీ అవార్డును అందుకున్నారు. హన్మకొండ జిల్లా అంబాల గ్రామానికి చెందిన గుర్రం భాగ్యలక్ష్మి సుదర్శన్ గౌడ్ పుణ్య దంపతులకు ద్వితీయ కుమారుడిగా జన్మించిన గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి..తాను కోరుకున్న ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించి..మొదటగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్ లో ప్రొబేషనరీ ఎస్ఐగా విధుల్లో చేరాడు. తర్వాత ములుగు జిల్లా వాజేడులో పోస్టింగ్ తీసుకుని అక్కడ మూడు సంవత్సరములు పని చేశాడు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో రెండు సంవత్సరాలు, చిట్యాలలో రెండు సంవత్సరాలు పనిచేసి ములుగు జిల్లా ఏటూర్ నాగారంకు బదిలీపై వెళ్లి విధులు నిర్వహిస్తూ..పేరూర్ పోలీస్ స్టేషన్ కు బదిలై ప్రస్తుతం అక్కడ విధులను నిర్వహిస్తున్నారు. అక్కడ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు ఏనలేని సేవలను అందిస్తున్న గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయనకు పోలీస్ మెడల్ గ్యాలంట్రీ అవార్డును అందించారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, తోటి ఉద్యోగులు, జిల్లా అధికారులు, ప్రజలు ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంటే..తాము మాత్రం మేలుకొని శాంతి భద్రతల పరిరక్షణలో కాపలా కాసే వృత్తిలో ఉన్నామని, ఎండనకా..వాననకా, రేయనకా..పగలనకా, కుటుంబంతో కలిసి జీవించి, మరణించే వరకు నిత్యం సేవ చేసే వృత్తిని ఎంచుకుని..24 గంటల పాటు నిరంతరం విధులను నిర్వహిస్తూ..పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం అనే పదానికి వన్నె తెచ్చేలా..ఏ ఆపదైనా తనను ఆశ్రయిస్తే..ప్రతి ఒక్కరి పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ..ప్రభుత్వం అంటేనే పోలీసులు అనేలా గుర్తుకు వచ్చే విధంగా..అన్ని పరిస్థితుల్లో..అన్ని వేళల్లో తనను ఆశ్రయించిన ప్రజలకు న్యాయం చేయడంలో..సంపన్నుడు మొదలు..అతి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ..ప్రతి అవసరానికి సాయం కోరిన వెంటనే స్పందించే తత్వం గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ ది అని ప్రజలు కొనియాడుతున్నారు. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే..అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి..వారి భద్రతకు భరోసాను ఇచ్చేది..ఆస్తులను రక్షించేది పోలీసులని, శాంతి భద్రతలను అదుపులో పెట్టడం, నేరాలను నియంత్రించడం పోలీసుల కీంకర్తవ్యమని భావించి నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ అధికారి గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ కు ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు రావడం పట్ల ఆయన స్వగ్రామం అంబాల గ్రామంలోనే కాకుండా ఆయన ఎస్ఐగా విధులు నిర్వహించిన వివిధ మండలాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి, కీలక బాధ్యతలు పొంది.. పోలీస్ శాఖకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.

శ్రీ సూర్య గిరి ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

కేసీఆర్ కు షాక్.. 50 మంది కాళేశ్వరం ఇంజనీర్లపై యాక్షన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button