మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసం యువ నాయకుడు దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ప్రజల నుంచి తమకు మంచి స్పందన వస్తుందని, మల్కాజ్గిరిలో సునీతమ్మ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని మస్తాన్ రెడ్డి చెప్పారు. ఇంటింటి ప్రచారంలొ డివిజన్ ప్రెసిడెంట్ మొయినొద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహ, ప్రధాన కార్యదర్శి కనకయ్య గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రవి ముదిరాజ్, రాజారెడ్డి, ఆదినారాయణ, కృష్ణ మూర్తి, అనిల్, వేణు, సరోవర్ పాల్గొన్నారు.
Less than a minute