క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మావోయిస్ట్లకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున బిజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మహిళా నక్సలైట్ సహా ఆరుగురు హతమైనట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చికురుభట్టి, పుసబాక గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. యాంటీ-నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడిన మావోయిస్ట్లు కాల్పులు జరిపినట్టు బస్తర్ రేంజ్ ఐటీ పి. సుందరరాజన్ తెలిపారు. డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్ (డీఆర్జీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కోబ్రా ఎలైట్ యూనిట్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టిందని చెప్పారు.
Read Also : మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ!!
మావోయిస్ట్ల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయని, ఎన్కౌంటర్ ప్రాంతంలో ఆరు మృతదేహాలను బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వీరిలో ఓ మహిళా నక్సలైట్ కూడా ఉన్నట్టు ఐజీ వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతోందని అన్నారు. కాగా, బిజాపూర్ జిల్లాలోని లోక్సభ స్థానాలకు తొలి దశలో ఏప్రిల్ 19 ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన బీజాపూర్.. మావోయిస్ట్లకు కంచుకోట. అక్కడ కీకారణ్యాలు మావోలకు వరంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భద్రతా బలగాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నక్సల్స్ ఏరివేత కోసం అడవుల్లో జల్లెడ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ కాంగ్రెస్లో బీసీ లొల్లి… సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్న కొందరు నేతలు!!
- లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో చేరే మెదటి వ్యక్తి సీఎం రేవంత్రెడ్డి… కేటీఆర్ హాట్ కామెంట్స్
- అన్నదాతలకు అండగా రంగంలోకి గులాబీ బాస్.. రోడ్ మ్యాప్ రెడీ!!!!
- దేశానికి ఏం చేశారని మూడోసారి మోదీకి ఓటు వేయాలి… ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
- పైన పటారం.. లోన లొటారం.. నిర్లక్ష్యానికి పరాకాష్టలో మిషన్ భగీరథ పనులు!!!