క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్లు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అధికార అవినీతిగా చెప్పుకునే ఎలక్టోరల్ బాండ్స్ అన్ని ప్రధాన పార్టీలకు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నారు. సుప్రీంకోర్టుకు ఎస్బీఐ సమర్పించిన జాబితా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనూ కాక రేపుతోంది. ఏపీ, తెలంగాణకు చెందిన ప్రధాన పార్టీలకు వివిధ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చాయి. బడా సంస్థ మెఘా నుంచి భారీ ఎత్తున నిధులు బాండ్స్ రూపంలో పార్టీలకు వచ్చాయి. మెఘా ఇంజనీరింగ్ సంస్థ జాతీయ స్థాయిలో బీజేపీకి 669 కోట్ల రూపాయలు ఇవ్వగా.. బీఆర్ఎస్ కు 201 కోట్ల సమర్పించింది. వైసీపీకి 37 కోట్లు, టీడీపీకి 28 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఇచ్చింది. బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీకి ఇతర సంస్థల నుంచి భారీగానే విరాళాలు వచ్చాయి.
పార్టీలకు మెఘా విరాళాలు..
బీజేపీ- రూ.669 కోట్లు
బీఆర్ఎస్ – రూ.201 కోట్లు
కాంగ్రెస్- రూ.158 కోట్లు
డీఎంకే- రూ. 85 కోట్లు
టీడీపీ- రూ. 53 కోట్లు
వైసీపీ- రూ. 37 కోట్లు
జనసేన- రూ. 14 కోట్లు
—
బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు
మెఘా ఇంజనీరింగ్- రూ. 201 కోట్లు
యశోద హాస్పిటల్స్ – రూ.94 కోట్లు
చెన్నై గ్రీన్ ఫుడ్స్ – రూ.50 కోట్లు
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ – రూ.32 కోట్లు
హెటిరో డ్రగ్స్ – రూ.30 కోట్లు
హెటిరో ల్యాబ్స్ – రూ. 20 కోట్లు
దివీస్ ల్యాబ్స్ – రూ. 20 కోట్లు
—-
వైసీపీకి వచ్చిన విరాళాలు..
ఫ్యూచర్ గేమింగ్ – రూ.150 కోట్లు
మేఘా ఇంజినీరింగ్ – రూ.37 కోట్లు
రాంకో సిమెంట్స్ – రూ.24 కోట్లు
ఓస్ట్రో మాధ్య విండ్- రూ.17 కోట్లు
ఓస్ట్రో జైసల్మేర్ – రూ.17 కోట్లు
స్నేహ కైనటిక్ పవర్ ప్రాజెక్ట్స్- రూ.10 కోట్లు
—-
టీడీపీకి వచ్చిన విరాళాలు..
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ – రూ.40 కోట్లు
మేఘా ఇంజినీరింగ్- రూ.28 కోట్లు
వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్ మిషన్- రూ. 20 కోట్లు
నాట్కో ఫార్మా – రూ.14 కోట్లు
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్- రూ.13 కోట్లు
భారత్ బయోటిక్ – రూ.10 కోట్లు