క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ముగిసింది. నాలుగు రోజులపాటు గద్దెలపై పూజలందుకున్న దేవతలు.. శనివారం సాయంత్రం వనప్రవేశం చేయడంతో మహాజాతర ముగిసింది. ఈ నేపథ్యంలో మేడారం నుంచి హుండీలను హన్మకొండకు తరలించనున్నారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి దేవాదాయ శాఖ అధికారులు ఆదాయాన్ని లెక్కిస్తారు. ఫిబ్రవరి 29 నుంచి మేడారం హుండీల లెక్కింపు చేపట్టారు. మేడారంలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో హుండీల లెక్కింపునకు కసరత్తు ప్రారంభం కానుంది. పది రోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది. జాతరకు రెండు నెలల ముందు నుంచి మేడారాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
Also Read : రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ.. ఓ రాజకీయ నేత కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్!!
ఈ నేపథ్యంలో ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. జాతర నాలుగు రోజులలో 1.45 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. గతంలో 2022 జాతర సందర్భంగా హుండీ ఆదాయం రూ.11.44 కోట్లకుపైగా వచ్చింది. బంగారం 631 గ్రాములు, వెండి 48 కిలోల భక్తులు సమర్పించారు. అయితే, 2020లో వచ్చిన దాని కంటే తక్కువ. భక్తుల సంఖ్య పెరిగినా ఆదాయం తగ్గింది. కానీ, ఈసారి మాత్రం 2020 జాతరకు మించి ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈసారి రెండు నెలల ముందు నుంచే మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు రాక మొదలైంది. జాతర ముగిసిన తర్వాత ఆదివారం కూడా లక్షల్లో భక్తులు వచ్చి గద్దెల చెంత పూజలు చేస్తారు. దీంతో ఆదాయం కూడా పెరుగుతుందని నమ్ముతున్నారు.
ఇవి కూడా చదవండి :
- రూ.500లకే సిలిండర్ పథకం.. ముందు మొత్తం ధర చెల్లించాల్సిందే!
- బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్లోకి హైదరాబాద్ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్??
- యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు వేగవంతం చేయాలి.. ఆదేశాలు జారీ చేసిన మంత్రులు బృందం
- పార్కుల్లో అనైతిక పనులు.. ఆరు జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసు.. మేజిస్ట్రేట్ ముందు వాగ్మూలం ఇచ్చిన ఆకాష్