Telangana

మేడారం హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డ్.. ఎన్ని రూ. కోట్లు తెలుసా..?

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ కుంభమేళా మేడారం సమక్క – సారక్క మహా జాతర వైభవంగా ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి 24వ వరకు నాలుగు రోజులపాటు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో మహాజాతరకు దాదాపు కోటి 40 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు..తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు ముగిసింది. ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు సమక్షంలో హుండీలు తెరిచారు. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో పోలీస్ పహారా, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలు లెక్కింపు కొనసాగింది. జాతర చరిత్రలో మునుపెన్నడూ లేనంత ఆదాయం లభించింది. బంగారు, వెండి కానుకలతో పాటు కరెన్సీ కట్టలు కోట్లలో లభించాయి. ఇంతకీ ఎంత ఆదాయం లభించింది..? గత రికార్డులు ఎంత..?

Read Also : రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!!

మేడారం జాతర హుండీ ఆదాయంలో ఆల్ టైం రికార్డు నమోదయింది. ప్రతీ మేడారం జాతరకు భక్తులు పెరుగుతున్న తరహాలోనే కానుకలు, హుండీ ఆదాయం కూడా పెరిగిపోతుంది. ఈసారి జాతరలో కోటిన్నర మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదుకాగా హుండీ ఆదాయం కూడా అదేస్థాయిలో రికార్డు నమోదైంది. మేడారం జాతర హుండీ ఆదాయంలో ఇప్పటివరకు 2020 లో లభించిన 11 కోట్ల 64 లక్షల రూపాయల ఆదాయమే హైయెస్ట్ రికార్డుగా నమోదై ఉంది. ఆ జాతరలో ఒక కేజీ 63 గ్రాముల బంగారం, 53 కిలోల 450 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ఆ రికార్డు ను బ్రేక్ చేస్తూ ఈసారి జాతరలో భారీఎత్తున ఆదాయం లభించింది. ఈసారి జాతరలో మొత్తం 540 హుండీలు ఏర్పాటు చేయగా హుండీల కౌంటింగ్ బుధవారంతో ముగిసింది.

Also Read : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు..

ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి జాతరలో భారీగా ఆదాయం లభించింది. మొత్తంగా 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయల ఆదాయం లభించింది. 13 కోట్లకు పైగా ఆదాయం లభించడం ఇదే ప్రథమం. అయితే గత జాతరతో పోల్చితే కాస్త బంగారం కానుకలు తగ్గాయి. కానీ వెండి కానుకలు పెరిగాయి. కౌంటింగ్ ముగిసిన వెంటనే మేడారం పూజరులు, దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో బ్యాంక్ ఖాతాలో జమచేశారు. వచ్చిన ఆదాయాన్ని 1/3గా విభజించి పూజారులు, దేవాదాయశాఖకు పంచుతారు. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించడం పట్ల మేడారం పూజారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కౌంటింగ్ సమయంలో వివిత్రాలు ఈసారి చర్చగా మారాయి. నకిలీ కరెన్సీ, భక్తుల చిత్రమైన కోరికల చిట్టీలు కుప్పతెప్పలుగా వచ్చాయి.

ఇవి కూడా చదవండి : 

  1. ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరచాలి.. మంత్రి దనసరి అనసూయ సీతక్క
  2. ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్‌ఆర్‌ఎస్‌??.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
  3. ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
  4. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్‌బై
  5. ఎవ్వర్నీ వదలం, విచారణ జరిపిస్తాం.. యాదాద్రి పున‌ర్నిర్మాణంలోనూ అవినీతి : మంత్రి కోమటిరెడ్డి

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.