మహబూబాద్ జిల్లాలోని కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుల్ దౌర్జన్యం చేశారు.
కానిస్టేబుల్స్ సాంబయ్య, వీరన్న ఇసుక లారీ డ్రైవర్ ను నడిరోడ్డుపై బట్టలు విప్పి చితక బాదారు. రోజు మామూలు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్లను బెదిరింపులకు గురి చేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్..వారం రోజుల క్రితం కేసముద్రం ఫ్లైఓవర్ వద్ద ఇసుక లారీ డ్రైవర్ ను లారీ పక్కకు ఆపాలంటూ బెదిరింపులకు దిగారు. రోజు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.సు
ఇసుక లారీలతోపాటు పాసింగ్ లోడుతో వచ్చిన లారీలను వదిలిపెట్టకుండా ఇద్దరు కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.