
డబ్బులు లేవని చెప్తున్న ప్రభుత్వం రాష్ట్రం లో అందాల పోటీలు పెట్టీ 200 కోట్లు ఖర్చు పెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. విందులు వినోదాల కోసమే అందాల పోటీలు పెట్టారనీ , అందాల పోటీలు వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. రైతులు బాధల్లో ఉంటే పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి.. అందాల భామల కోసం గంటల తరబడి టైం కేటాయించారని మండిపడ్డారు హరీష్ రావు.
సీఎం రేవంత్రెడ్డి మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన ఆయన ఏకంగా తెలంగాణ తల్లినే మార్చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్రావు. ఉద్యమంలో ఒక తల్లి.. అధికారంలోకి వచ్చాక మరో తల్లి ఉంటుందా అని ప్రశ్నించారు. అందాల పోటీలకు రేవంత్ రెడ్డి ఐదు సార్లు అటెండ్ అయ్యాడని, అందాల భామలను చూసేందుకు టైమ్ ఉంది కానీ..మార్కెట్ యార్డులకు వెళ్లి ఒక్కసారైనా పరిశీలించారా అని ప్రశ్నించారు హరీష్రావు.
గజ్వేల్ లో పర్యటించిన హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్నిప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు తెస్తామని చెప్పి తెలంగాణ తల్లి నీ మార్చారనీ,కేసీఆర్ గుర్తులను మారుస్తామని అంటారనీ , కేసీఆర్ చెప్పిన అభివృద్ధిని మారుస్తారనీ అన్నారు.రేవంత్ వచ్చాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ,బిఆర్ ఎస్ హయాం లో కరెంట్ పోయేది కాదనీ,ఆగస్ట్ 15 లోగా రైతు రుణమాఫీ చేస్తానని యాదాద్రి దేవుడి పై ఒట్టు వేశాడనీ అన్నారు.ఒట్టు వేసి దేవుడునే మోసం చేశారనీ,కేసీఆర్ ఇచ్చిన రెట్టింపు పింఛన్ ఇస్తామని ఇవ్వలేదనీ అన్నారు.
గజ్వేల్ ప్రజలు ఈ మాటలు నమ్మలేదనీ గుర్తు చేశారు.జన్మలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ప్రజలు అంటున్నారనీ ఎద్దేవా చేశారు.రైతుల కోసం జిలుగు విత్తనాలు11 వందలు ఉంటే 22 వందలు చేశారనీ,జనానికి జిలుగు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి రేవంత్ అని అన్నారు.కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కూడ కోరుకుంటున్నారనీ అన్నారు.వడ్ల పైసలు ఇంకా పడట్లేదనీ, మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తిప్పికొడితే 10 వేల ఉద్యోగాలు ఇవ్వలేదనీ అన్నారు.గురుకులాల్లో అభివృద్ధి లేద నీ ,మూసి పునరుద్ధరీకరణ అని అక్కడే వదిలేశారనీ ,హైడ్రా అని దాన్ని కూడా వదిలేశారనీ హరీష్ రావు ఆరోపించారు .