Telangana

అద్దెకు ఉండేవారికీ ‘గృహజ్యోతి’ వర్తింపు.. ఫ్రీ కరెంట్‌పై TSSPDCL క్లారిటీ

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆరు గ్యారంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేయగా.. తాజాగా మరో రెండు గ్యారంటీల అమలకు కార్యచరణ రూపొందిస్తుంది. గృహ జ్యోతి పథకం కింద.. ప్రతి ఇంటికి 200 యూనిట్ల మేరకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ పథకానికి ఇటీవల కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈనెల 8న జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా.. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ‘గృహ జ్యోతి’ పథకానికి అర్హతలు, మార్గదర్శకాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది.

Read Also : కుమారీ అంటీ స్టోరీపై ‘నెట్‌ఫ్లిక్స్‌’లో డాక్యుమెంటరీ.. అమ్మ బాబోయ్..!?

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తారని అందులో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఒక ఇంటికి ఒక మీటరుకే పథకం అమలు చేస్తారని.. కిరాయికి ఉండేవారు అర్హులు కాదని అంటున్నారు. 200 యూనిట్లు లోపు కరెంట్ వాడే గృహ వినియోగదారులు మాత్రమే అర్హులుని.. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 2,181 యూనిట్ల లోపు వాడకం ఉండాలిని ఆ పోస్టులో పేర్కొన్నారు. గత సంవత్సరం మొత్తం ఓ వినియోగదారుడు 1500 యూనిట్లు వాడితే దానికి 10 శాతం కలిపి 1650 యూనిట్లను 12 నెలలకు విభజించి నెలకు 137 యూనిట్లు ఉచితంగా ఇస్తారు. ఆ పైన వాడితే బిల్లు లెక్క కడతారంటూ ప్రచారం జరుగుతుంది.

Also Read : బీఆర్‌ఎస్‌కు షాక్… కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత

ఈ పోస్టుపై విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL అధికారికంగా ట్విట్టర్ X లో ఓ ప్రకటన విడుదల చేసింది. పైన చెబుతున్నదంతా అబద్ధమని వారు కొట్టిపడేశారు. గృహజ్యోతి పథకానికి అద్దె ఇళ్లలో ఉండే వారు కూడా అర్హులే అని స్పష్టం చేశారు. ఎవరూ అపోహలకు లోనుకావద్దని.. నిజమైన అర్హులు కిరాయి ఇళ్లల్లో ఉన్నా వారికి కూడా ఫథకం వర్తిస్తుందని TSSPDCL అధికారులు ట్విట్టర్‌లో వెల్లడించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : 

  1. యునెస్కో గుర్తింపు వచ్చినా పట్టించుకోని అధికారులు.. రామప్ప ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తో విద్యార్థులకు భోజనం
  2. మేడారం జాతర పై మావోయిస్టు లేఖ కలకలం…
  3. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
  4. నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో కన్న కూతుర్ని హతమార్చిన తండ్రి
  5. రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల ఫోకస్.. రంగంలోకి ఈడీ, ఐటీ!!!

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.