తెలంగాణ

రేవంత్ రెడ్డే నాకు మూడు ఫాంహౌజులు కట్టించాడు.. సబితమ్మ కొడుకు సంచలనం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మధ్య కొంత కాలంగా వార్ సాగుతోంది. సబితమ్మను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తుండగా.. ముఖ్యమంత్రికి అదే స్థాయిలో సబిత కౌంటర్ ఇస్తోంది. హైడ్రా కూల్చివేతల తర్వాత సబితమ్మతో పాటు ఆమె కొడుకులను టార్గెట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పటోళ్ల కార్తీక్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డే తనకు మూడు ఫాంహౌజులు కట్టించారని అన్నారు. తన తల్లి సబితమ్మ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు కార్తీక్ రెడ్డి.

తుక్కుగూడలో నిర్వహించిన రైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సబితమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సభలో మాట్లాడిన పటోళ్ల కార్తీక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్లు చేశారు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకలకు మూడు ఫార్మ్ హౌస్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. మా అమ్మ పొద్దున లేచి మూడు ఫార్మ్ హౌస్లు ఎక్కడ ఉన్నాయని నన్ను అడుగుతుంది.. నాకు తెల్వదు అమ్మ.. ముఖ్యమంత్రే నా కోసం కట్టి వాటిని నాకు గిఫ్ట్ ఇస్తాడేమో అని చెప్పిన అంటూ సెటైర్లు వేశారు పటోళ్ల కార్తీక్ రెడ్డి. నాకు ఉన్నది ఒకటే ఇల్లు.. మిగతా మూడు మీరే గుర్తించి మీరే కూల్చండి అని సీఎంకు సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి మీద దోతి కథ చెప్పి అందరిని నవ్వించారు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి. రేవంతన్న సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు చెరువు ఎప్టీఎల్ లో ఉంది. కాని దాన్ని కూల్చడు అంట.. మంత్రి జూపల్లి కృష్ణ రావు ఇల్లు మూసీ పరివాహక ప్రాంతంలో ఉంది.. అది ఆయనకు కనిపియ్యదు.. జవహర్ నగర్లో అందరికి జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా అని చెప్తున్నారు.. మీ మంత్రిని తీసుకొని పోయి జవహర్ నగర్లో పెద్ద చెత్త కుప్ప మీద డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టియండి అని పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button