తెలంగాణహైదరాబాద్

జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత.. కొట్టుకున్న బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు!!

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ ప్రతినిధి : జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమావేశం ప్రారంభమైనప్పట్నుంచీ టెన్షన్ వాతావరణమే నెలకొంది. అనుకున్నట్లుగానే కార్పొరేటర్లు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. దీంతో కౌన్సిల్‌లో పరిస్థితులు అదుపులో లేకుండా పోయాయి. ప్లకార్డులు చూపించుకున్న అంశంపై మొదలైన ఈ గొడవ కొట్టుకునే పరిస్థితికి వెళ్లింది. కౌన్సిల్‌ను కంట్రోల్ చేయలేక.. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే సభ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెళ్లిపోయారు. ఈ దాడి ఘటనపై కౌన్సిల్ హాల్‌లోనే బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనలకు దిగారు. తమ కార్పొరేటర్లపై దాడి చేసిన ఎంఐఎం కార్పొరేటర్లు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also : కేకేకు కీలక పదవి.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!!

పోడియం ముందు కూర్చుని బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కౌన్సిల్ హాల్ లోపల భారీగా మార్షల్స్ మోహరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరు తగ్గలేదు. ప్లకార్డులు చూపించడం మొదలుకుని గొడవ, ఆందోళన వరకూ వారిని నిలువరించే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. కలుషిత నీటిపై కౌన్సిల్‌లో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. దీంతో తమ డివిజన్‌లో కూడా కలుషిత నీరు వస్తోందని మేయర్ విజయలక్ష్మి చెప్పారు. అయితే ఈ కౌన్సిల్‌కు జలమండలి ఎండీ హాజరుకాలేదు.

Also Read : బీఆర్ఎస్‌కి భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

దీంతో ఆ ఎండీపై కార్పొరేటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్‌ నుంచే జలమండలి ఎండీతో అశోక్ రెడ్డితో మేయర్ ఫోన్‌లో మాట్లాడారు. జ్వరం కారణంగా తాను కౌన్సిల్ సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు వాటర్ బోర్డ్ ఎండీ వివరణ ఇచ్చుకున్నారు. జలమండలి ఎండీని కౌన్సిల్ మీటింగ్‌కు రావాలని మేయర్ కోరారు. అయితే ఈ వ్యవహారంపై కలుగజేసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి  కార్పొరేటర్లకు సారీ చెప్పారు. దీంతో కార్పొరేటర్లు కాస్త శాంతించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొట్లాటతో మొదలై.. గొడవతోనే ముగిసింది. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల కొట్లాటతో కౌన్సిల్ సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలు.. పట్టించుకోని మండల విద్యాధికారి
  2. తెలుగు రాష్ట్రాలకు నేడు బిగ్‌ డే.. ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ!!
  3. హత్నూర మండల బిఎస్పి పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ పార్టీకి రాజీనామా…
  4. 10 ఎకరాల లోపు రైతులకే రైతు భరోసా?.. ముగిసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
  5. అట్లుంటది మనతోని.. బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపిన కల్వకుంట్ల హిమాన్షు!!

Related Articles

Back to top button