
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ స్పోర్ట్స్ న్యూస్:- ఎంతో ఘనంగా ప్రారంభమైన ఐపీఎల్ 18వ సీజన్ సరికొత్త రికార్డుతో ముగిసింది. దాదాపు 18 ఏళ్లుగా కప్పులేని జట్టు బెంగుళూరు ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో కప్పు నెగ్గింది. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో హోరాహోరీగా జరిగింది. 2025 ఐపీఎల్ 18వ సీజన్ బీసీసీఐ కి భారీ లాభాలనే తెచ్చిపెట్టడంతోపాటుగా లైవ్ ను వీక్షించిన జియో హాట్ స్టార్ వంటి ప్రసార కర్తలను కూడా మంచి ఆదాయంతో నింపింది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో అనగా 64.3 కోట్ల మంది ప్రేక్షకులు ఫైనల్ మ్యాచ్ను ఆస్వాదించారు. గత సంవత్సరంలో 60 కోట్ల మంది క్రికెట్ ప్రేమికులు జియో లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసారు. అంటే ఈ సంవత్సరం ఆ రికార్డు కూడా బద్దలైపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ అనేది ముఖేష్ అంబానీ జేబును గట్టి ఆదాయంతో నింపింది.
ఈ 18వ ఐపీఎల్ సీజన్లో ముఖేష్ అంబానీ తన జియో హాట్స్టార్ ప్రత్యక్ష వీక్షణ ద్వారా బాగానే కొన్ని వేలకోట్లలో డబ్బులు సంపాదించారు. ఈ సీజన్లో మొత్తంగా జియో స్టార్ ఏకంగా 6000 నుంచి 7000 కోట్ల మధ్య ప్రకటన ఆదాయాన్ని సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకోగా… అది సాధించిందని చెప్పాలి. ఇలా హాట్ స్టార్ లో ప్రకటన ఆదాయం, సబ్స్క్రిప్షన్ ఆదాయం, కొన్ని సంస్థల భాగస్వామ్యాల ద్వారా అన్ని ఒప్పందాలు కలుపుకొని 2025 లో ముఖేష్ అంబానీ దాదాపుగా 6000 కు కోట్లకు పైగానే డబ్బులు సంపాదించ ఉండవచ్చని కొంతమంది నిపుణులు అంచనా వేశారు. దీంతో ముఖేష్ అంబానికి అలాగే తన వైఫ్ నేత అంబానికి కూడా ఐపీఎల్ మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి ..