
హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానంటూ భర్తకు షరతు పెట్టింది భార్య సోమన్. ఆలయానికి తీసుకెళ్లి కిరాతకంగా చంపేసింది. తర్వాత తనకు ఏమి తెలియనట్లు నటించింది. పోలీసుల విచారణలో భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. భర్త ఇష్టం లేకపోవడంతో.. ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు భార్య సోనమ్ ఒప్పుకుంది. తన బావను తన చెల్లె హత్య చేయించిందని, నేరం రుజువైతే తన చెల్లిని ఉరి తీయాలని సోనమ్ అన్న గోవింద్ పోలీసులకు చెప్పారు.
భర్తను హత్య చేసే ప్లాన్ లో భాగంగా దట్టమైన అడవులతో నిండిన నాంగ్రియాట్ ప్రాంతంలోని కామాఖ్య ఆలయం దగ్గరికి తీసుకెళ్లాలని భర్తను బలవంతం పెట్టింది సోనమ్. భర్తను హతమార్చేందుకు బాయ్ఫ్రెండ్తో కలిసి పథకం పన్ని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లింది సోమన్. తొలుత నాంగ్రియాట్ ప్రాంతానికి వెళ్లగా అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండటంతో.. వెయిసావ్రింగ్ జలపాతం వద్దకు తీసుకెళ్లి అక్కడ కిరాయి హంతకులతో హత్య చేయించింది సోనమ్
భర్త రాజా రఘువంశీని హంతకులకు అప్పగించి, హత్య చేస్తుంటే అక్కడే ఉండి చూసింది సోనమ్. సోనమ్, ఆమె బాయ్ఫ్రెండ్ రాజ్ కుశ్వాహాదీ, మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు