ఆంధ్ర ప్రదేశ్
Trending

వంశీని కక్షపూరితంగానే టార్గెట్ చేశారు: వైఎస్ జగన్

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కార్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కక్షపూరితంగానే వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కావాలని పదేపదే వంశీని రెచ్చగొట్టేలా టిడిపి నేత పట్టాభి మాట్లాడుతున్నారని అన్నారు. కేవలం పట్టాభి రెచ్చగొట్టడం వల్ల టిడిపి ఆఫీస్ పై ఆరోజు జాడి జరిగిందని అన్నారు.

అప్పుడు టిడిపి పార్టీ చేసిన ఫిర్యాదులో వంశీ పేరు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇప్పుడు మాత్రం అధికారంలో ఉన్నామని ధీమాతో ఆ కేసును రీఓపెన్ చేసి వంశీకి బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్లు మార్చారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి ఆఫీస్ పై దాడి జరిగిన కేసులో వల్లభనేని అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి

  1. అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!..
  2. భార్యను హతమార్చి… భర్త ఆత్మహత్యాయత్నం!!
  3. ట్రోల్స్ కు గురవుతున్న మాజీ ఎంపీ కేసినేని నాని !.. ఎందుకంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button