Monday, February 23, 2026
Homeఆంధ్ర ప్రదేశ్Vasamsetty Subhash: కాలుపెడితే తొక్కిపడేస్తాం.. BRSకు మంత్రి స్ట్రైట్ వార్నింగ్

Vasamsetty Subhash: కాలుపెడితే తొక్కిపడేస్తాం.. BRSకు మంత్రి స్ట్రైట్ వార్నింగ్

Vasamsetty Subhash: కోనసీమ వేదికగా ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణకు పరిమితమైన గులాబీ పార్టీగా పేర్కొన్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆంధ్రా గడ్డపై అడుగుపెట్టాలనుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సరిహద్దు దాటి వస్తే ఊరుకునేది లేదని స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు.

ప్రత్యేకంగా శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలో ఆ వర్గాన్ని ఓసీ జాబితాలో చేర్చడం ద్వారా అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఆ నిర్ణయం మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాలనలో తీసుకున్నదని విమర్శించారు. అలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించేందుకు ప్రయత్నిస్తే శెట్టిబలిజలు ఏకమై ఎదుర్కొంటారని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.

అంతేకాక, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ జగన్)పై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే యోగా మంచిదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ALSO READ: High Alert: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గాల్లో డ్రోన్లు, నేలపై బలగాలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments