
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా గ్రామపంచాయతీ ఎన్నికల సమరం త్వరలో అందరి ముందుకు రాబోతుంది. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూసే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న పక్షం రోజుల్లో వెలబడనున్నట్టు రాజకీయ విశ్లేషకుల సమాచారం.
ఎన్నికల సమరంలో యువతదే తొలిమెట్టు
రాజకీయాలకు అతీతంగా పార్టీలకు పొంతన లేకుండా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో యువతదే తొలిమెట్టు అని పబ్లిక్ టాక్.. పక్షపాత ధోరణి పోకుండా పర్ల సొమ్ము ఆశించకుండా.. సొంత రాజకీయ ఆలోచనతో.. సొంత రాజకీయ ఎజెండాతో.. ప్రజలకు సేవ చేసే నాయకులే కావాలంటూ కోరుకునే నేటి యువత ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో వారి తీర్పును నిర్మొహమాటంగా వెళ్ళు పరిచే అవకాశం ఉంది.
చీకటి ప్రచారాలు..
రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ జెండాను ఎక్కడ పాతలో..ఏ ఎజెండా లేని స్థానిక నాయకులు ముందస్తుగానే ప్రాణాలిక సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ముందుగానే రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి తమ మనుగడ చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశాల్లో స్థానిక లీడర్ల పాత్ర ఘనంగా ఉంది అని తెలుస్తుంది.
ఎరుదాటాలి..!! :- గ్రామపంచాయతీ ఎన్నికల సమరంలో ప్రథమ స్థానంలో నిలవాలంటే తమ ప్రతిభను కనబాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కులం చూసో..మతం చూసో.. గుంపు చూసో..గుర్తు చూసో.. వేసే ఓట్లు కానందున స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించే దిశలో గ్రామీణ యువత ఉన్నారు, దీనికి పర్యవసానంగా పోటీలో నిలిచే అభ్యర్థులు కూడా ఓట్లు రాబట్టుకోవడానికి నాన్న తిప్పలు పడుతున్నారు.
అర్హులైన వారికి పట్టం కట్టాలి: ఓడేటి లక్ష్మారెడ్డి
గ్రామపంచాయతీ ఎన్నికల జాబితాలో నిలిచే అభ్యర్థుల జాబితాను, వారి పూర్వ రాజకీయ స్థితిగతులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే వారికి అవకాశం ఇవ్వాలని సూరారం గ్రామ సీనియర్ (యూత్..) కాంగ్రెస్ నాయకులు ఓడేటి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుర్తుల కోసమో గుంపుల కోసమో చేసే యుద్ధం కాదు అని, గ్రామ సంగ్రామంలో గ్రామాభివృద్ధి ద్యేయంగా పనిచేసే వ్యక్తి కావాలని.. అలాంటి వారికి ఓటు వేసి గెలిపించాలని, గ్రామంలో విజేతగా నిలిచే అభ్యర్థి గ్రామాభివృద్ధికి అనునిత్యం సేవ చేయాలని అలాంటి వారికే పట్టం కట్టాలని లక్ష్మారెడ్డి యువతకు పిలుపునిచ్చారు.