క్రైమ్ మిర్రర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పైన పటారం..లోన లొటారం..అన్న తరహాలో ఉంది వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం పులు మామిడి గ్రామంలోని గతం ప్రభుత్వంలో చేసిన మిషన్ భగీరథ పనులు పరిస్థితి. గ్రామంలో పైప్ లైన్ కోసం సిసి రోడ్డు తవ్వి గాలికి వదిలేశారు..మరి కొన్ని చోట్ల సిమెంట్ పూసి పైకి మాత్రం అందంగా కనిపిస్తున్నా..నాణ్యత లేక కొన్ని మాసాలకే డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.లక్షల రూపాయలు వెచ్చించి భగీరథ నిర్మాణాలు చేపట్టి.. నాసిరకం పనులతో నిధులు రాళ్లలో పోస్తున్నారు.ఓ వైపు పనులు ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు పూర్తి కాకపోవడం లో ఆంతర్యం ఏమిటో అని గ్రామస్తులు గుసగుసలు ఆడుతున్నారు.ఇప్పటికే నిర్మించిన చోట కొద్దిరోజులకే పనుల్లో నాణ్యత లోపాలు బయట పడుతున్న దుస్థితి నెలకొంది.దీనికి నిదర్శనమే పులు మామిడి గ్రామంలోని 11వ వార్డు. భగీరథ కోసం సిసి రోడ్లను తవ్వి పైపువేసి అలాగే వదిలేయడంతో అటు వెళ్లే వాహన చోదకులు, పాదచారులకు ఇబ్బందికరంగా మారింది. పగటి వేళల్లో రోడ్డు మధ్యలో రంధ్రం కనిపిస్తుంది. అదే రాత్రయితే ఆ గుంతలో పడటం కాయం అనిపిస్తోంది. ప్రస్తుతం పులు మామిడి గ్రామంలో భగీరథ నాసిరకం పనులతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.బూడిదలో పోసిన పన్నీరులా నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే వినికిడి వినిపిస్తోంది.
Read Also : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్
అధికారుల పర్యవేక్షణ కరువు…!!
ప్రభుత్వ పనులు నిర్వహిస్తున్నప్పుడు అధికారుల పర్యవేక్షణ కరువవడంతో గుత్తేదార్లదే రాజ్యమైంది. చేసిన పనులకు క్యూరింగ్ లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. మిషన్ భగీరథ, అండర్ డ్రైనేజ్,సీసీ రోడ్ల నిర్మాణం ఇతర నిర్మాణాలు పర్యవేక్షణ చేయడంలో సంబంధిత శాఖ అధికారులు గాని ఇంజనీర్ అధికారులు గాని పర్యవేక్షిచడం,పరిరక్షించడంలో విఫలమవుతున్నారనీ గ్రామస్తులు అంటున్నారు.అదేవిధంగా మిషన్ భగీరథ కాంట్రాక్టర్ నీటి పైపులు ఏర్పాటు చేయడానికి గుంతలు తీయడం వల్ల కాలనీ సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి.కాలనీ రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం వల్ల రోడ్డు నీటితో నిండి ఉంటున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అడిగేవారే లేరు రోడ్డు మీదికి వస్తే దుమ్ము ధూళితో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో నాసిరకం నిర్మాణంతో నిధులు వృథా అవుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పట్టాలెక్కనున్న డోర్నకల్-గద్వాల రైలు మార్గం ప్రాజెక్టు!!!
పనుల్లో కనిపించని నాణ్యత…!!
పనుల్లో పురోగతి మాట అటుంచితే నాణ్యత విషయంలోనూ కాంట్రాక్టర్లు కక్కుర్తి పడుతున్నారు.కాంట్రాక్టర్ల కక్కుర్తి.. అధికారుల అవినీతికి చిహ్నంగా నిలుస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజ్, సీసీ రోడ్డు నిర్మాణాల్లో నిబంధనలు పాటించడం లేదు. ఒక పక్క నిర్మిస్తుంటే.. మరో పక్క పగుళ్లు, రంధ్రాలు పడి అగమ్య గోచరానికి అద్దం పడుతోంది. సర్కారు పనులు జరుగుతున్నప్పుడు క్వాలిటీ కంట్రోల్ శాఖ తనిఖీలు లేవు. ఇంకేముంది.. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత డొల్లతనం.. అవినీతి మయం కనిపిస్తుంది. డ్రైనేజ్, రోడ్డు పనుల్లో నిబంధనలు పాటించడం లేదు.అయితే ఈ పనుల్లో వాడే కంకర, ఇసుక, సిమెంట్ నాణ్యత లేకపోవడంతో పిండిగా ఉండే కంకర వాడుతున్నట్లు తెలుస్తుంది.కంకర వేసి రోలింగ్ చేసే క్రమంలో వాటర్ క్యూరింగ్ సక్రమంగా చేయడం లేదు. దీనివల్ల బరువైన వాహనాలు ఈ డ్రైనేజ్ లపై వెళ్లడంతో దెబ్బతింటున్నాయి.
Read Also : హిందూ మహిళకు అంతిమ సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం మహిళ..!
గ్రామ సమస్య పట్టించుకోని కార్యదర్శి…!!
పులిమామిడి గ్రామంలో సమస్యలతో సతమంతమవుతున్న కూడా పంచాయతీ కార్యదర్శి ఆ సమస్యలు తమకు పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గ్రామపంచాయతీ ముందే కంకర చెత్త వేయడం దీనికి నిదర్శనం.గ్రామంలో కొన్నిచోట్ల పైకి పెద్దపెద్ద రంద్రాలతో ప్రమాదకరంగా మారిన మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు.ప్రధాన రోడ్డు పక్కనే డ్రైనేజ్ మోరీ కూలిపోయి ఉండడం కనిపిస్తుంది. ఇవేవీ సమస్యలు తమకు పట్టవున్నట్లు గ్రామపంచాయతీకి అనేకు 11 బజే జానెకు 3బజే అన్నట్లు పంచాయతీ కార్యదర్శి వీధులు నిర్వహించడం చూస్తుంటే ఆయనకు గ్రామ అభివృద్ధిపై ఎంత ఉందో అనేది అర్థమవుతుంది.ఈ పని చేయని పంచాయతీ కార్యదర్శి మాకొద్దని పై స్థాయి అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- బిగ్ డే.. ముగియనున్న కవిత కస్టడి.. బెయిల్ రాకపోతే నెక్స్ట్ ఏంటి..?
- కోమటిరెడ్డి బ్రదర్స్ కూల్ కాలేదా.. అద్దంకి పదవి రానట్టేనా?
- వడ్డీ చెల్లించలేదని..నడ్డి విరిచాడు…చంపేస్తానంటూ తన స్టైల్ లో వార్నింగ్..?
- అన్ని పార్టీలకు కాళేశ్వరం అవినీతి డబ్బులు!
- మాముళ్ల కోసం లారీ డ్రైవర్ బట్టలు విప్పి కొట్టిన కానిస్టేబుల్స్