క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కుమారీ ఆంటీ.. ప్రస్తుతం హైదరాబాద్లో ఓ ట్రెండింగ్ సెలెబ్రిటీ. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ఏరియా మాదాపూర్లో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి.. ఎంతో మంది యువతకు తన చేతి వంట రుచి చూపించారు. ఎన్నో ఫుడ్ స్టాల్స్ ఉన్నా.. రుచికరమైన భోజనంతో పాటు తీయ్యనైన మాటలతో కస్టమర్లను తమ స్టాల్ వైపు వచ్చేలా చేసుకున్నారు. ఇదే విషయాన్ని కొంత మంది ఫుడ్ వ్లాగర్స్ తమ యూట్యూబ్ ఛానల్స్లో కుమారి ఆంటీ గురించి చెప్పటంతో.. ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. కుమారీ ఆంటీనే. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, యువత మాత్రమే కాదు.. సినిమా సెలెబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్కు క్యూ కట్టారు. ఆమె చేతి మహిమో.. వంటలోని కమ్మదనమో.. మాటల్లోని తియ్యదనమో.. కానీ రోజూ ఆమె ఫుడ్ స్టాల్కు కస్టమర్ల జాతరే.
Read Also : బీఆర్ఎస్కు షాక్… కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత
అంతా భాగానే సాగుతుందనుకుంటున్న సమయంలోనే.. ట్రాఫిక్ పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుందని, కుమారి ఆంటీపై కేసులు నమోదు చేసి.. ఫుడ్ స్టాల్కు అక్కడి నుంచి తీసేయించారు. అంతే.. అప్పటివరకు కేవలం సోషల్ మీడియాలోనే ఫేమస్ అయిన ఆంటీ.. అటు మేన్ స్ట్రీమ్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఎంతగా అంటే.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించి.. ఆమెను ఇబ్బంది పెట్టోద్దని పోలీసులకు ఆదేశాలిచ్చేంత. ఇక అప్పటి నుంచి.. కుమారి ఆంటీ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు ఆమె ఎవరు. ఎక్కడి నుంచి వచ్చింది. ఇంతకు ముందు ఏం చేసేది.. ఇప్పుడు ఇంతలా ఫేమస్ అయ్యేందుకు కారణాలేంటీ.. అన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే సమయానికే.. చిన్నా చితకా యూట్యూబ్ ఛానళ్లన్నీ ఆమెను ఇంటర్వ్యూలు చేయగా.. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానళ్లు కూడా ఆమెను ఫోకస్ చేస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు.. కుమారీ ఆంటీపై ఓ డాక్యుమెంటరీ తీయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : మేడారం జాతర పై మావోయిస్టు లేఖ కలకలం…
నెట్ ఫ్లిక్స్లో కుమారి ఆంటీపై 3 ఎపిసోడ్లతో ఒక డాక్యుమెంటరీ ప్లానింగ్ చేస్తుందని.. దానికి “ఫేమ్” పేరు కూడా పెట్టినట్టు.. ఆ డాక్యుమెంటరీ త్వరలోనే విడుదల కానున్నట్టుగా ఓ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం తెలియరాలేదు. నిజంగా నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేస్తే మాత్రం ఆ సంస్థ అధికారికంగానే ప్రకటిస్తుంది కదా అన్నది ఓ వర్గం వాదన. అయితే.. ఈ వార్తపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అమ్మ బాబాయ్.. ఒక్క నిమిషం ఇది నిజమే అనుకున్నానని ఒకరు.. మరీ ఇంత పెద్ద జోకా అని కొందరు.. చెప్తే నమ్మోలా ఉండాలి బ్రో అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఇది నిజమే కావచ్చని నమ్మిన కొన్ని వెబ్ సైట్లు.. ఏకంగా వార్తలు కూడా వండేశాయి. డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ స్వయంగా ప్రకటించిందని.. ఇందులో ఆమె నేపథ్యం.. తన సొంతూరు నుంచి హైదరాబాద్కు వచ్చి ఇంత ఫేమస్ ఎలా అయ్యిందన్న ప్రయాణాన్ని అందులో చూపించనున్నారంటూ వార్తను చాలా రుచికరంగా వండేశారు. అంతేమరి.. ప్రస్తుతం సోషల్ మీడియా అలా ఉంది. కుమారి ఆంటీ తుమ్మినా, దగ్గినా.. కూడా సోషల్ మీడియాలో పెద్ద తుఫానే వచ్చేలా ఉంది. దాన్ని తట్టుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో కన్న కూతుర్ని హతమార్చిన తండ్రి
- కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం పెద్దఎత్తున పోటీ.. 17 ఎంపీ సీట్లకు 306 దరఖాస్తులు
- పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్..!
- రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల ఫోకస్.. రంగంలోకి ఈడీ, ఐటీ!!
2 Comments