క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ పాత ఇంటి కూల్చివేస్తుండగా అందులో నిద్రపోయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో సదరు వ్యక్తి గదిలో నిద్రించగా.. అది గమనించిక కూల్చివేత పనులు చేపట్టడంతో అక్కడే జీవ సమాధి అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ తన పాత ఇంటిని కూల్చేయాలని డిసైడ్ అయ్యారు. ఇల్లు శిథిలావస్థక చేరటంతో బుధవారం కూల్చివేత పనులు ప్రారంభించాడు. ఇంటిని కూల్చటానికి ఒకరోజు ముందు అందులో అద్దెకు ఉన్న అందరినీ ఖాళీ చేయించాడు. బుధవారం ఉదయం పాక్షికంగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు.
Read Also : దోస్త్ మేరా దోస్త్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఉత్తమ్, కోమటిరెడ్డి ప్రశంసల జల్లు.. కారణం ఏంటి..?
అనంతరం కూలీలు భోజన విరామానికి వెళ్లారు. ఈ గ్యాప్లో ఇంట్లో అద్దెకు ఉండే స్వామి రెడ్డి అనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. మద్యం మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోపల నిద్రపోయాడు. ఆ విషయం తెలియకుండా భోజనం తర్వాత కూలీలు తిరిగి ఇంటి నిర్మాణం కూల్చివేత పనులు ప్రారంభంచారు. ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోవటంతో స్వామిరెడ్డి అక్కడే జీవ సమాధి అయ్యాడు. మరుసటి రోజు అంటే ఇవాళ ఇంటి శిథిలాలను జేసీబీతో తొలగిస్తుండగా.. మృతదేహం బయటపడింది. స్థానికల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి :
- బిగ్బాస్ ఫేం షణ్ముక్ ఇంట్లో గంజాయి.. అన్న కోసం వెళితే అనుకోని విధంగా..!
- రేపు మేడారం జాతరకు సిఎం రేవంత్ రెడ్డి రాక..
- నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి రాక..
- భారీ ఉద్యమానికి బీఆర్ఎస్ సన్నాహాలు.. నీటి పోరు యాత్ర పేరుతో త్వరలో ప్రజాల్లోకి..!
- 18 ఏళ్ల తరువాత దుబాయ్ జైలు నుంచి విముక్తి.. కన్నీళ్లతో సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు
One Comment