యువ నాయకుడు దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో అల్లాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. వివేకానందా నగర్ సెంటర్ లో డివిజన్ ప్రెసిడెంట్ మొయినుద్దీన్ అధ్యక్షతన జరిగిన సభలో కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేష్ సమక్షంలో మస్తాన్ రెడ్డికి మద్దతుగా వందలాది మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సభలో మాట్లాడిన బండి రమేష్.. మస్తాన్ రెడ్డి నాయకత్వంలో డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందన్నారు. కాలనీ వాసుల కోసం మస్తాన్ రెడ్డి కోరినట్లుగా అల్లాపూర్ వార్డు కార్యాలయంగా వినియోగిస్తున్న వివేకాంద నగర్ కమ్యూనిటి హాల్ ను పూర్తిగా ప్రజలకు అందుబాటులోనికి తీసుకు వస్తానని హామి ఇచ్చారు. లోకసభ ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూము వేణు, నర్సింహ యాదవ్, రేష్మ, భారతి, కనకయ్య, సుంకన్న, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పల్లపు వేణు, నాగి రెడ్డి, కృష్ణమూర్తి, ఆది రెడ్డి, వేణు, రవి ముదిరాజ్, రాజా రెడ్డి, ఆది నారాయణ, సతీష్ రెడ్డి, అశోక్, గణేష్, గణపతి,అనిల్ కుమార్, రామా రావు, జయరాం, శర్మ, భాను ప్రకాష్, శ్రవణ్, గణేష్, పవన్ పాల్గొన్నారు.
1 minute read