క్రైమ్

రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ నాగరాజు

సర్వేయర్ల సమావేశంలోనే అవినీతి: రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన ఏసీబీ

క్రైమ్ మిర్రర్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం చంద్రంపేట గ్రామంలో సర్వేయర్ల సమావేశం జరుగుతుండగా, అదే గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ సర్వేయర్ నాగరాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.

గ్రామంలో సర్వే పనుల్లో సహకరించాలని కోరిన రైతుని నుంచి లబ్దిదారుడిగా చేర్చే నిమిత్తం లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఇది అంగీకరించకుండా, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం సర్వేయర్ నాగరాజు లంచం తీసుకుంటుండగానే అధికారులు అతనిపై దాడి చేసి పట్టుకున్నారు.

ఇప్పటికే నాగరాజుపై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఏసీబీ పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. అవినీతి బహిరంగమవుతోన్న నేపథ్యంలో ప్రజలు అధికారుల అవకతవకలపై స్పందిస్తూ, ఎక్కడ లంచం డిమాండ్ అయితే వెంటనే 14400కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button