క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణవాసులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో మరో కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల మీదుగా ఈ ట్రైన్ లైన్ ఏర్పాటు కానుంది. సౌత్ సెంట్రల్ రైల్వే(ఎస్సీఆర్) గతేడాది మంజూరుకు ప్రతిపాదించిన డోర్నకల్-గద్వాల రైలు మార్గానికి దాదాపుగా మార్గం సుగమైంది. రైలు మార్గం నిర్మాణానికి అవసరమైన తుది సర్వే ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రైలు మార్గం నిర్మాణానికి అవసరమైన తుది సర్వే మార్కింగ్ పనులు నల్గొండ జిల్లాలోని మోతె మండలంలో జరుగుతున్నాయి. నూతన రైలు మార్గం సర్వే పనులు డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం మీదుగా మోతె మండలంలోని కొత్తగూడెం గుండా సాగుతున్నాయి.
Read Also : హిందూ మహిళకు అంతిమ సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం మహిళ..!
ఇప్పటికే తుది స్థాన సర్వే(ఫైనల్ లొకేషన్ సర్వే)లో భాగంగా మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లి తదిరత గ్రామాల వద్ద రహదారి పాసింగ్లను గుర్తించి సర్వే బృందం మార్కింగ్లు చేశారు. ఈ రైలు మార్గానికి ఎఫ్ఎల్ఎస్ సర్వే కోసం గతేడాది ఎస్సీఆర్ రూ.7.40 కోట్లు మంజూరు చేసింది. సుమారు 296 కిలోమీటర్ల పొడవున్న ఈ రైల్వే లైను నిర్మాణానికి రూ.5330 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించింది. దక్షిణ తెలంగాణలోని కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, నల్గొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి, భూత్పూర్ తదితర ప్రధాన ప్రాంతాలను కలుపుతూ ఈ మార్గం సాగనుంది.
Also Read : బిగ్ డే.. ముగియనున్న కవిత కస్టడి.. బెయిల్ రాకపోతే నెక్స్ట్ ఏంటి..?
నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు పర్యాయాలు రైల్వేలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, సురక్షిత ప్రయాణం కావడంతో ప్రజలంతా రైలు ప్రయాణాలకే మొగ్గుచూపుతున్నారు. అమృత్ భారత్ పేరుతో స్టేషన్లను ఆధునికీకరిస్తుండటంతోపాటు కొత్త రైళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోజురోజుకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువవుతోంది. దీన్ని నివారించేందుకు అదనపు లైన్ల ఏర్పాటుతోపాటు కొత్త రైల్వే లైన్లు నిర్మించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణలో డోర్నకల్-గద్వాల్ మధ్య 296 కిలోమీటర్ల మేర కొత్త లైను అందుబాటులోకి రాబోతోంది.
ఇవి కూడా చదవండి :
- కోమటిరెడ్డి బ్రదర్స్ కూల్ కాలేదా.. అద్దంకి పదవి రానట్టేనా?
- వడ్డీ చెల్లించలేదని..నడ్డి విరిచాడు…చంపేస్తానంటూ తన స్టైల్ లో వార్నింగ్..?
- అన్ని పార్టీలకు కాళేశ్వరం అవినీతి డబ్బులు!
- మాముళ్ల కోసం లారీ డ్రైవర్ బట్టలు విప్పి కొట్టిన కానిస్టేబుల్స్
- ఆపరేషన్ ఆకర్ష్తో బీజేపీ ఖుష్.. అభ్యర్థుల ప్రకటనపై నాయకుల జోష్..