
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములును హిందూ వ్యతిరేక సంస్థలు టార్గెట్ చేశాయని తెలుస్తోంది. ఆయన హత్యకు ప్లాన్ చేశారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మహేశ్వరం బీజెపి నేత అందెల శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కి నిర్వహించడం సంచలనంగా మారింది.
మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు ఇంటి ముందు రెక్కీ నిర్వహించారు రోహింగ్యాలు. అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పద తిరుగుతున్న 6 గురు వ్యక్తులను గుర్తించారు బిజెపి కార్యకర్తలు,నేతలు.పెట్రోల్ బాటిల్,సుత్తి, కట్టర్,ఐరన్ రాడ్స్,బాక్స్ లో పెట్టుకుని తిరుగుతున్నారు సదరు వ్యక్తులు.గత కొన్ని రోజులుగా రోహింగ్యాల పై ఉద్యమం చేస్తున్నారు బిజెపి నేత అందెల శ్రీరాములు యాదవ్. అందుకే ఆతన్ని టార్గెట్ చేశారని భావిస్తున్నారు.
అందెల శ్రీరాములు ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న రోహింగ్యాలను బీజెపి నేతలు పట్టుకోడానికి ప్రయత్నించగా బండి వదిలి పారిపోయారు. ఐదుగురు వ్యక్త లను గుర్తించి మీరు పేట పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు బిజెపి నేతలు. దొరికిన ఐదుగురు వ్యక్తులను అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు మీరు పేట పోలీసులు.అందెల శ్రీరాములకు ప్రాణహాని ఉందని బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.