క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలు ఒంటిపూట బడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి ఆరంభం నుంచే భానుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. సామాన్యులు బయట అడుగు పెట్టాలంటే హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మార్చి15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలల వేళలు నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read Also : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రేవంత్ సర్కారుకు హైకోర్టులో ఎదురు దెబ్బ…
అయితే పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్ధులకు క్లాసులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత యథాతథంగా ఉదయం పూటే తరగతులు నడుస్తాయని వివరించింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం కావడంతో ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. పదో తరగతి పరీక్షలకు పరీక్షా సెంటర్లుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మధ్యాహ్నం వేళ క్లాసులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయా బడుల్లో ముందుగా విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం అందించి, ఆ తర్వాత తరగతులు నిర్వహించనున్నారు. మార్చి 28తో టెన్త్ ప్రధాన పరీక్షలు ముగిసినా.. మరో రెండు రోజులు రియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. మార్చి 30తో పరీక్షలు ముగిశాక యధావిధిగా ఉదయం పూట తరగతులు నిర్వహిస్తారని సమాచారం.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్.. నేడు భూమి పూజ నిర్వహించనున్న సీఎం రేవంత్
- మేడారం హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డ్.. ఎన్ని రూ. కోట్లు తెలుసా..?
- మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దనసరి సీతక్క..
- రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!!