
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- జమ్మూ కాశ్మీర్, పహల్గాం లో ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులు దాదాపు 30 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారు. దీంతో భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఉగ్రవాదులను పాకిస్తాన్ అన్నం పెట్టి పోషిస్తుందని ఇప్పటికీ చాలా దేశాల ప్రతినిధులు ఈ ఉగ్రవాదాలను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించాయి. అయితే పాకిస్తాన్పై ప్రతి చర్యగా ఆపరేషన్ సింధూర పేరిటాపాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావురాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ చాలా బాగా సక్సెస్ కావడంతో సినిమా మరియు రాజకీయ ప్రముఖులు స్పందించారు.
ఇక తాజాగా ఆపరేషన్ సింధూరిపై సానియా మిర్జా సంచలన పోస్ట్ చేశారు. ” ఒకే ఒక ఫోటోను షేర్ చేసి… ఇది మా దేశం ‘ భారతదేశం ‘ అంటూ ఒక శక్తివంతమైన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలో కలనల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యూమికా సింగ్, వీళ్ళిద్దరి మధ్యలో విక్రమ్ మిశ్రీ ఉండడం ఈ ఫోటోకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా?.. ఇక్కడ కలనల్ సోఫియా ఒక ముస్లిం, వింగు కమాండర్ వ్యోమిక సిక్కు. దీంతో పహాల్గంలో ఉగ్రవాదులు మత ప్రాతిపదికను ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సందర్భంలో… ఈ ఉగ్రవాదులను అణిచివేసేది వేరువేరు మతాలకు చెందిన ఉన్నతాధికారులు కలిసి దేశం వైపు నిలబడడం అనేది దేశ సమైక్యతకు ప్రత్యేకంగా నిలుస్తుంది. భారతదేశం యొక్క బలం దాని భిన్నత్వంలోనే ఉందని ప్రతి ఒక్కరూ వీళ్ళకి సెల్యూట్ చేస్తున్నారు. సానియా మీర్జా చేసిన ఈ పోస్టు క్షణాల్లోనే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిపోయింది. ఆమె దేశభక్తిని అలాగే ధైర్యాన్ని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే వారికి ఈ పోస్టు ఒక గట్టి సమాధానం ఇస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం.. సంచలన విషయాలను వెల్లడించిన కల్నల్ సోఫియా
సహాయం చేయాలని వెళ్లి మృత్యువాత -టైర్ మార్చడానికి వెళితే మరో కారు ఢీకోట్టింది.