క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డికి గుండెపోటు వచ్చింది. శ్వాస తీసుకోవటం తీవ్ర ఇబ్బంది తలెత్తగా.. తిరుపతి రెడ్డిని హుటాహుటిన మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి సకాలంలో తీసుకెళ్లటంతో.. వైద్యులు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం తిరుపతి రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు వెల్లడించారు. మెడికవర్లో చికిత్స పొందుతున్న తన సోదరున్ని సీఎం రేవంత్ రెడ్డి మరో సోదరుడు కొండల్ రెడ్డి పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుల్లో ఒకరైన తిరుపతి రెడ్డి.. తమ ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నారు. అయితే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి విజయం సాధించటంలో తిరుపతి రెడ్డి పాత్ర చాలా ఉందని శ్రేణులు చెప్తున్నాయి. కాగా.. ఆయనకు నియోజకవర్గంలో యువత నుంచి మంచి ఫాలోయింగే ఉండగా.. ఆ మధ్య ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఈ ఎంపీ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి పోటీ చేయనున్నారని వార్తలు ప్రచారం జరిగాయి. అయితే.. మహబూబ్నగర్ నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డిని అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా.. పలు సందర్భాల్లోనూ తన కుటుంబం నుంచి ఎవ్వరూ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని క్లారిటీ కూాడా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- మార్చి15 నుంచి ఒంటి పూట బడులు.. విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ
- గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రేవంత్ సర్కారుకు హైకోర్టులో ఎదురు దెబ్బ…
- హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్.. నేడు భూమి పూజ నిర్వహించనున్న సీఎం రేవంత్
- మేడారం హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డ్.. ఎన్ని రూ. కోట్లు తెలుసా..?
- నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు..