క్రైమ్ మిర్రర్, శంషాబాద్ : శంషాబాద్ లో వీధి కుక్కలు దాడిలో 20 నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎయిర్పోర్ట్ పోలీసుల కథనం ప్రకారం. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సూర్య కుమార్ దంపతులు ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉన్నట్లు.పెద్ద కుమారుడు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా పోలీసులు వారు నివాసం ఉంటున్న పక్కనే కుక్కలు గుంపులుగా కనిపించడంతో చుట్టుపక్కల వేతకగా బాలున్ని కుక్కలు బాలుని శరీరా భాగాలను కరవడంతో అతను చనిపోయినట్లు గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు.
పత్తాలేని మున్సిపాలిటీ అధికారులు
మున్సిపాలిటీ పరిధిలోని పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు పత్తా లేకుండా పోయారు. మున్సిపాలిటీ పరిధిలో అనేకమైన అక్రమ బిల్లుల వ్యవహారంలో గత రెండు రోజులు కిందట మున్సిపల్ అధికారులు ఆకస్మిక చర్యలు చేపట్టినట్లు సమాచారం.గతంలో మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్ ఊట్పల్లి ఆర్బి నగర్ తదితర ఏరియాలో వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేసిన సంఘటనలు చోటు చేసుకున్న మున్సిపాలిటి అధికారులు మాత్రం స్పందించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చిన్నారి మృతి కి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాలుని తల్లిదండ్రులు కోరుతున్నారు.
4 Comments