
మునుగోడు, క్రైమ్ మిర్రర్ : మునుగోడు మండల పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన కోడి నరేష్ భార్య నవ్య గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.వీరికి ఒక 9 నెలల చిన్నారుడు కలడు..నరేష్ ది నిరుపేద దళిత కుటుంబం.విషయం తెలుసుకున్న,మునుగోడు జిల్లా పరిషత్ పాఠశాలలో 2008 / 09 సంవత్సరంలో 10 వ తరగతి చదువుకున్న కోడి నరేష్ కు తోటి విద్యార్దులు తండ్రి కుమారుల పేరు మీద 50 వేల రూపాయలు పోస్టాపీస్ లో కిసన్ వికాస్ పత్ర స్కీమ్ లో జమ చేశారు.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.గ్రామస్థులు విద్యార్ధులను అభినందించారు.ఆపదలో మేము ఉన్నాం అంటూ అండగా నిలిచినందుకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..2008 సంవత్సరం ,విద్యార్దులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.