క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : నిత్యం కాలుష్యంతో సతమతమవుతున్న హైదరాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించటం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. జీహెచ్ఎంసీ ఆధ్యర్యంలో ఈ పార్కులను నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సీనియర్ సిటిజన్లు, కుటుంబాలతో సరదాగా గడిపేవారు పార్కులకు వెళ్తుంటారు. అయితే ఇలా ఆహ్లాదం కోసం వేళ్లే వార్కులు అసాంఘిక కార్యకలపాలకు అడ్డాలుగా మారుతున్నారు. కొందరు యువతీ యువకులు పార్కుల్లో బరితెగిస్తున్నారు. ప్రైవేటుగా చేయాల్సిన పనులను కూడా పబ్లిక్గా కానిచ్చేస్తున్నారు. అలాంటి అనైతిక పనులకు పార్కులను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. చెట్ల పొదల మాటున చిల్లర వేషాలు వేస్తున్నారు.
Read Also : ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసు.. మేజిస్ట్రేట్ ముందు వాగ్మూలం ఇచ్చిన ఆకాష్
వీరి చర్యలతో ఫ్యామీలతో పార్కులకు వచ్చేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్న పిల్లలను పార్కులకు తీసుకురావాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో పార్కుల్లో అసాంఘిక కార్యకలపాలపై నగర పోలీసులు దృష్టి పెట్టారు. రంగంలోకి షీ టీమ్స్ను దించారు. బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై ఈ షీ టీమ్స్ దృష్టి సారించాయి. తాజాగా నెక్లెస్రోడ్, ఇందిరా పార్క్, కృష్ణకాంత్పార్క్తోపాటు ఇతర పబ్లిక్ ప్లేస్లలో సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన జంటలను శుక్రవారం షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. మెుత్తం 12 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన వీరికి ఫైన్ వేసి, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. నెక్లెస్రోడ్తో పాటు హైదరాబాద్ నగరంలోని ఇతర పార్కుల్లో షీ టీమ్స్ నిఘా ఉంటుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- హీటెక్కుతున్న లోక్సభ ఎన్నికల పోరు.. రాష్ట్రంలో త్రిముఖ పోటీ తప్పదా??
- వృద్ధాప్యంలో తల్లిన పట్టించుకోని కొడుకు.. కుమారుడు, కోడలికి జైలు శిక్ష!!!
- సీఎం హెచ్చరించినా వినిపించుకోలేదు.. ముగ్గురు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్
- నేడు జనం నుంచి వనంలోకి వనదేవతలు.. మూడోరోజు బారులు తీరిన భక్తజనం
- భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి.. నేడు సీఎం సుదీర్ఘ సమీక్ష