క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. ఆరు గ్యారంటీల అమలుకు సిద్ధమైంది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు కాగా.. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మరికొన్ని గ్యారంటీలు అమలు చేసేందుకు రెడీ అయింది. అందులో భాగంగా.. పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (మార్చి 11) భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనుంది. దశల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. స్థలం ఉన్న వారికి.. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేయనున్నారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ నమూనాలను తీర్చిదిద్దారు. తొలి విడతలతో అన్ని 90 వేల పైచిలుకు లబ్ధిదారులను గుర్తించారు.
ఇవి కూడా చదవండి :
- కాంగ్రెస్ వైపు మరో బీఆర్ఎస్ నేత చూపు.. శరవేగంగా మారుతున్న రాజకీయాలు!!
- చనిపోయిన స్నేహితురాలు పిలుస్తోందంటూ వివాహిత ఆత్మహత్య..
- ఆ జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేక్… ఎందుకో తెలుసా?
- పార్కుల్లో అనైతిక పనులు.. ఆరు జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మార్చి15 నుంచి ఒంటి పూట బడులు.. విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ