
-
పెండింగ్ అంశాలపై సెంట్రల్ మినిస్టర్స్ తో చర్చలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన రేవంత్… పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర ఆరోగ్యం , కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయతో రేవంత్ భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై మాండవీయతో చర్చించారు. ఇవాళ, రేపు పలువురు కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ భేటీకానున్నారు.