Telangana

అనర్హత వేటు వేయాలంటూ దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్.. ఎంపీ ఎన్నికల వేళ షాక్ తప్పదా..?

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల వేళ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాక్ తగిలేలా ఉంది. దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పాటు ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని చెప్పారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ మేరకు దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. కాగా ఈ పిటిషన్ రేపు (మార్చి 28) విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.

Read Also : తెలంగాణలో మరోసారి తెరపైకి జిల్లాల విభజన.. లోక్ సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు..?

కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండు వారాల క్రితం కారు పార్టీకి షాక్ ఇస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన రెండ్రోజులకే దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా.. బలమైన అభ్యర్థిని దింపాలనే యోచనలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దానంను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. కాగా, ఆయన పార్టీ మారటంపై ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని.. దానంపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలోని బృదం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.

Also Read : బిజాపూర్‌లో భీకర ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి!!!

ఈ ఇష్యూ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే.. తాజాగా మరో వ్యక్తి దానంపై ఫిర్యాదు చేయటం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.. దానం నాగేందర్‌కు మరో కేసులో హైకోర్టు ఇది వరకే నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు కూడా నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానంకు నోటీసులు జారీ చేసింది. ఇలా పార్లమెంట్ ఎన్నికల వేళ దానంకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు కాగా.. అనర్హత వేటు వేసేలా హైకోర్టు స్పీకర్‌ను ఆదేశిస్తుందా ? అనేది హాట్ టాఫిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి : 

  1. మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ!!
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ లొల్లి… సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్న కొందరు నేతలు!!
  3. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో చేరే మెదటి వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి… కేటీఆర్ హాట్ కామెంట్స్
  4. అన్నదాతలకు అండగా రంగంలోకి గులాబీ బాస్.. రోడ్ మ్యాప్ రెడీ!!!!
  5. దేశానికి ఏం చేశారని మూడోసారి మోదీకి ఓటు వేయాలి… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.