అంతర్జాతీయంక్రైమ్తెలంగాణ

సిడ్నీ కాల్పుల ఘటన.. హైదరాబాద్‌లో ఉగ్రవాదికి లింకులు

టెర్రరిస్ట్‌ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలపై లక్ష్యంగా విరుచుకుపడి, విపరీతమైన కాల్పులు జరుపుతూ ప్రాణాల్ని బలిపెట్టడం సాధారణం అయింది.

టెర్రరిస్ట్‌ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలపై లక్ష్యంగా విరుచుకుపడి, విపరీతమైన కాల్పులు జరుపుతూ ప్రాణాల్ని బలిపెట్టడం సాధారణం అయింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బోండి బీచ్ ఘటనా వివరాలు అంతా కలవరపెంచాయి. అక్కడ సాజిద్‌ అనే ఉగ్రవాది బీచ్‌లో ఉన్న యూదులను లక్ష్యంగా గుంపుగా కాల్పులు జరిపి 16 మంది ప్రాణాలు కోల్పోయేలా చేశారు, మరికొంత మంది గాయపడ్డారు. ఇంతికీ అంతా ప్రాణ భయంతో పరుగెత్తిన సమయంలో అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి ధైర్యంగా పోరాడాడు.

బుల్లెట్ల జార్పును ఎదుర్కొని, ఉగ్రవాది చేతిలోని గన్‌ను ధైర్యంగా లాక్కున్నాడు. ఈ ధైర్యానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అహ్మద్‌ను నేషనల్ హీరోగా ప్రకటించారు. అహ్మద్‌ చూపిన ధైర్యానికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి వెల్లువెత్తింది.

ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన సాజిద్‌ వద్ద ఇండియన్‌ పాస్‌పోర్ట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతను హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ పొందినట్లు వెల్లడైంది. హైదరాబాద్ నుంచి సాజిద్ ఫిలిప్పిన్స్‌, పాకిస్తాన్‌ వెళ్లినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనలో ఉగ్రవాద లింకులు తెలంగాణతో కూడా అనుసంధానమై ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా పరిరక్షణ చర్యలను కఠినతరం చేసి, ఉగ్రవాదుల లింకులను పూర్తిగా బయటకు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిటీలోని ప్రజలు, యాత్రికులు, సామాన్యులు భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: Political: మెస్సీ ఈవెంట్ ఇష్యూ.. క్రీడా శాఖ మంత్రి రాజీనామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button