తెలంగాణ

బీఆర్‌ఎస్‌లో బ్లేమ్‌ గేమ్‌ - కవిత ఇంటికొచ్చి పలకరించినా స్పందించని కేసీఆర్‌..!

ఎమ్మెల్యే కవిత… కేసీఆర్‌ కూతురు. సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి.. తెలంగాణ రాజకీయాల్లో సంచలంగా మారిన మహిళా నాయకురాలు. తెలంగాణ జాగృతి పేరుతో సొంత కార్యాచరణ రూపొందించుకుని ముందు వెళ్తున్నారు. అయితే.. కాళేశ్వరం విచారణ సందర్భంగా.. తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన ఆమెకు.. విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎదురెళ్లి పలకరించినా… కేసీఆర్‌ ఆమెను పట్టించుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో..? రాజకీయం ఎంతో..? తెలీదు గానీ.. కేసీఆర్‌ కవితను పలకరించలేదని గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.

కేసీఆర్‌… కాళేశ్వరం కమిషన్‌ విచారణకు వెళ్లేందుకు.. భర్త అనిల్‌తో కలిసి ఎర్రవెళ్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు కవిత. కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే… కేసీఆర్‌ మాత్రం ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదట. కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి.. గుడ్‌మార్నింగ్‌ డాడీ అని పలకరించినా… ఆయన స్పందించలేదట. పైగా.. ఆగు అన్నట్టు చేయి చూపి సైగ చేశారని సమాచారం. అయితే.. విచారణ వెళ్లే హడావుడి, పార్టీ నేతలు భారీగా చేరుకోవడంతో ఉన్న గందరగోళం వల్లే… కేసీఆర్‌ కవితను పలకరించి ఉండన్న వాదన వినిపిస్తోంది. ఫామ్‌హౌస్‌లో పై అంతస్తు నుంచి లిఫ్ట్‌లో కేసీఆర్‌ కిందకు వచ్చేవరకు కవిత, ఆమె భర్త అనిల్‌ కేసీఆర్‌ వెంటనే ఉన్నట్టు సమాచారం. కేసీఆర్‌ విచారణ కోసం హైదరాబాద్‌ బయలుదేరగానే… కవిత, ఆమె భర్త కూడా హైదరాబాద్‌ వెళ్లిపోయారట.


Also Read : కేసీఆర్‌ను కవిత ఎందుకు కలిసినట్టు..? – గులాబీ బాస్‌ ప్లానేంటి..?


కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కొందరని కవిత టార్గెట్‌ చేశారు. ఆ తర్వాత.. తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లోనే గులాబీ జెండాలు కనిపించలేదు. ఈ పరిణామాల తర్వాత.. కవిత.. కేసీఆర్‌ను కలవడం ఇదే తొలిసారి. అయినా.. కవితను కేసీఆర్‌ పలకరించలేదని సమాచారం. అయితే.. కేసీఆర్‌ ఆదేశాలతో కవిత ఎపిసోడ్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటి వరకు పెద్దగా రియాక్ట్‌ కాలేదు. మరి భవిష్యత్‌లోనూ ఇలాగే ఉంటారా..? అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button