
తెలంగాణ మంత్రివర్గంలో కోల్డ్ వార్ ముదిరిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కూడా కొందరు మంత్రులు ఖాతరు చేయడం లేదు. కేబినెట్ సమావేశంలోనే ఒక మంత్రికి ముఖ్యమంత్రికి గొడవ జరిగిందని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒక మంత్రి వాగ్వాదానికి దిగారని.. మరో సీనియర్ మంత్రికి ఇంకో మంత్రికి కూడా వాగ్వాదం జరిగిందని బీజేపీఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వీళ్లకి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫండ్స్ అలొకేషన్ విషయంలో గొడవ జరిగిందని చెప్పారు.
నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని.. ఇందు కోసం రూ.1000 కోట్ల అలోకేట్ చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తే సీనియర్ మంత్రి వ్యతిరేకించారని ఏలేటీ తెలిపారు. ఎన్నో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయని.. అన్ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తీసుకుపోతే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ మంత్రికి వాగ్వాదం జరిగిందని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి గత కేబినెట్ మీటింగ్ లో రాయితీలు ఇచ్చారు. ఉదండపూర్ రిజర్వాయర్ ఎస్టిమేషన్ ను రూ.430 కోట్ల నుండి రూ.1150 కోట్లకి రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయించుకున్నాడు పొంగులేటి. అయితే పొంగులేటికి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చారు.. మరి మాకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారు కదా వాళ్లకు ఎందుకు ఇవ్వరని మంత్రుల మధ్య పంచాయితీ మొదలైందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.