క్రీడలు

గెలిచిన ఆనందం.. ప్రజల్లో మాయం… నిరాశగా ఫ్యాన్స్… లండన్ కు విరుష్క.. అసలు జాలే లేదంటున్న ప్రేక్షకులు!

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ స్పోర్ట్ న్యూస్ :- ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొట్టమొదటిసారిగా కప్పు గెలిచింది. గెలిచిన ఆనందంతో ప్రేక్షకులకు కళ్ళు మూసుకుపోయాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బెంగళూరు జట్టుకు ఫ్యాన్స్ అంతా ఇంత కాదు. గెలిచినా తరువాత చిన్న స్వామి స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీని మ్యూజియంల ఏర్పాటు చేశారు. దీంతో ప్రేక్షకులు అందరూ కూడా తమ క్రికెట్ అభిమానులు ఈసారి కప్పును ఎలా ఆస్వాదిస్తున్నారనేది చూడడానికి స్టేడియానికి లక్షల సంఖ్యలో హాజరవ్వడానికి వచ్చారు. కానీ చిన్న స్వామి స్టేడియం లో సిట్టింగ్ కెపాసిటీ కేవలం 35000 మాత్రమే. కానీ అక్కడికి లక్షకు పైగా జనాలు రావడంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. దీంతో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గెలిచిన సందర్భంలో ఒకవైపు క్రికెట్ ప్లేయర్స్ మరియు అభిమానులు చాలా ఆనందంగా విజయోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఇలా జరగడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది..

ఇక ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, చాలామందికి గాయాలు అవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యంతో పాటుగా విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మలు కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అలాగే ఆర్ సి బి టి మొత్తం కూడా చాలా ఆవేదనకు లోనయ్యామని పేర్కొన్నారు. కానీ అంతలోనే విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ లండన్ వెళ్లిపోవడంతో జనాలు తీవ్రంగా ఆగ్రహించుకుంటున్నారు. ఒకవైపు ఇంతలా గాయాలు పాలై, 11 మంది చనిపోయిన కూడా వీరు ఇప్పటికిప్పుడే లండన్ వెళ్లాల్సినంత అవసరం ఏముందని ఫ్యాన్స్ అందరు కూడా చాలా మండిపడుతున్నారు. మనదేశంలో, అది కూడా విరాట్ కోహ్లీకి ఎంతమంది ఫాన్స్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోహ్లీకి ఏమైనా జరిగితే క్షణంలోనే అతనిని ఆదరించడానికి కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ఉన్నారు. కానీ విరాట్ కోహ్లీ అలాగే తన జట్టు వల్ల ఏకంగా 11 మంది మరణించడంతో కనీసం పట్టనట్టు అలా ఎలా విదేశాలకు వెళ్ళిపోతారంటూ… అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై అనేక మంది ప్రముఖులు నెట్టెంటా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల భద్రతపై ఇంతటి నిర్లక్ష్యం తీసుకున్నందుకు అధికారులపై కూడా వేటు వేయాలని చాలామంది కోరుతున్నారు. మరి ఈ సమయంలో విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ విదేశాలకు వెళ్లడంలో ఎంతటి ఆస్కారం ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

ఇక మన దగ్గరే రాఫెల్ తయారీ, ఎరోస్పేస్ హబ్ గా హైదరాబాద్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button