
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ గురించిన షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. లేడీ అఘోరీ కోట్లాది ఆస్తులు ఉన్నాయట. ఈ విషయాలను ఇటీవల అఘోరీతో సావాసం చేసిన వర్షిణి తల్లిదండ్రులు బయటపెట్టారు. ప్రస్తుతం వర్షిణి తిరిగి మంగళగిరిలోని తన ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలోనే వర్షిణి తల్లిదండ్రులు అఘోరీ ఆస్తులకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకు అఘోరీ పూజలు చేస్తుందని అందుకోసం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తుందన్నారు. అలాగే హీరో ప్రభాస్ ఇంటి పక్కన 8 కోట్ల విలువైన విల్లా కూడా ఉన్నట్లు తెలిపారు.
Also Read : టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది అఘోరీ- వర్షిణి వ్యవహారం. కలిసి దేశవ్యాప్త పర్యటనలు చేస్తూ హల్చల్ చేసిన ఈ జంటకు వర్షణి సోదురుడు విష్ణు పెద్ద షాక్ ఇచ్చాడు. తన సోదరిని వెతుక్కుంటూ వెళ్లి మరీ వెంటపెట్టుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దారి తప్పిన సోదరిని తిరిగి తీసుకొచ్చిన అన్నగా తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు విష్ణు. అన్న అంటే ఇలా ఉండాలి కదా అని అంతా చర్చించుకుంటున్నారు.