క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : నల్గొండ దద్దరిల్లేలా ఈ నెల 13నా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభ ఉంటుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలసాధాన కోసం బీఆర్ఎస్ నల్గొండలో నిర్వహిస్తున్న ఛలో నల్గొండ సభ ఏర్పాట్లను జగదీష్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభకు కేసిఆర్ స్వయంగా హాజరై కృష్ణా ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడతారనిచెప్పారు. సీఎంరేవంత్ రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తామంటున్న రేవంత్ రెడ్డిదినీచ సంస్కృతి. ఇవాళ దొంగల చేతికి తెలంగాణ పోయింది. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తీసుకరాకుంటే కాంగ్రెస్ వాళ్ళను గ్రామాల్లో తిరగనివ్వం. అని హెచ్చరించారు. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఆధీనంలోని కేఆర్ఎంబీకి అప్పగించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఛలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- సొంతిళ్లు లేని పేదలకు గుడ్న్యూస్.. నియోజకవర్గానికి 3,500ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు
- తెలంగాణ అసెంబ్లీలో ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క..
- సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. మేడిగడ్డ పర్యటనకు సిద్దమౌతున్న రాష్ట్ర ప్రభుత్వం
- చౌటుప్పల్లో కిడ్నాప్ ముఠా కలకలం.. కారులో వచ్చి పిల్లల్ని అపహరించేందుకు యత్నం
- అడిగిన చోట బస్సు ఆపలేదని రెచ్చిపోయిన మహిళ.. కండక్టర్ పై చెప్పుతో దాడి