క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఒకప్పుడు రేవంత్ అంటేనే అంతెత్తున ఎగిరిపడే ఆ నేతలు.. ఇప్పుడు అదే రేవంత్పై పొగడ్తలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహగీతం పాడుతున్నారు. ఇంతకీ ఆ నేతలు దారికొచ్చారా? లేక రేవంతే దారికి తెచ్చుకున్నారా?.. అనేది చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు.. తెలంగాణ కాంగ్రెస్లో కాకలు తిరిగిన నేతలు. మా రక్తం కాంగ్రెస్, మా ప్రాణం కాంగ్రెస్ అంటూ.. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తూ.. ఎన్నో కీలక పదవులు చేపట్టారు. అయితే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అంటే ఈ ఇద్దరు నేతలకు అస్సలు పడేది కాదు. సందు దొరికిందంటే.. వాగ్బాణాలు సంధించేవారు.
Read Also : బిగ్బాస్ ఫేం షణ్ముక్ ఇంట్లో గంజాయి.. అన్న కోసం వెళితే అనుకోని విధంగా..!
సీన్ కట్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కోమటిరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి స్వరం మారింది. ఒకప్పుడు గరం గరంగా ఉన్న ఆ నేతలు.. ఇప్పుడు స్నేహగీతం అందుకున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ రేవంత్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో రేవంత్దే కీలక పాత్ర అంటూ పొగడ్తలతో ముంచెత్తారు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం అదే బాణీ అందుకున్నారు. రాష్ట్రమంతా తిరిగి రేవంత్ కష్టపడ్డారంటూ చెప్పుకొచ్చారు. గతంలో శత్రువులు కాస్తా ఇప్పుడు మిత్రులుగా మారిపోయారు. శత్రుత్వంతో సాధించలేనిది మిత్రత్వంతో సాధించవచ్చని ఆ నేతలు అభిప్రాయపడ్డారో ఏమో గానీ.. ప్రేమిస్తే ఏమవుతుంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతేకదా అంటూ రేవంత్కు స్నేహ హస్తం అందిస్తున్నారు ఈ ఇద్దరు నేతలు.
ఇవి కూడా చదవండి :
- రేపు మేడారం జాతరకు సిఎం రేవంత్ రెడ్డి రాక..
- నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి రాక..
- భారీ ఉద్యమానికి బీఆర్ఎస్ సన్నాహాలు.. నీటి పోరు యాత్ర పేరుతో త్వరలో ప్రజాల్లోకి..!
- భారీ ఉద్యమానికి బీఆర్ఎస్ సన్నాహాలు.. నీటి పోరు యాత్ర పేరుతో త్వరలో ప్రజాల్లోకి..!
- హారన్ కొట్టినందుకు.. ఆర్టీసీ డ్రైవర్ను చితకబాదిన ప్రయాణికులు
One Comment