మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునితా మహేందర్ రెడ్డికి అల్లాపూర్ డివిజన్ నుంచి భారీ మెజారిటీ ఇస్తామని యువ నాయకుడు దేవరింటి మస్తాన్ రెడ్డి చెప్పారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని మూసాపేట, అల్లాపూర్ డివిజన్ల బూత్ లెవల్, ఎన్నికల కార్యాచరణ సమావేశానికి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, కూకట్ పల్లి కో ఆర్డినేటర్ కోటంరెడ్డి వినయ్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి బండి రమేష్, టీపీసీసీ అధికార ప్రతినిధి డా సత్యం శ్రీరంగం, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, విఠల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా సునితా మహేందర్ రెడ్డిని కలిశారు మస్తాన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు మొయినొద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహ, ప్రధాన కార్యదర్శి కనకయ్య, శ్రీనివాస్ రెడ్డి, సుంకన్న, భారతమ్మ, రేష్మ, రవి ముదిరాజ్, రాజా రెడ్డి, ఆది నారాయణ, సతీష్ రెడ్డి, సత్య నారాయణ, కృష్ణ, సుబ్బయ్య చౌదరి, అనిల్ కుమార్, వెంకటేష్, భాను ప్రకాష్ పాల్గొన్నారు.
Less than a minute