Telangana

మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోక రాగానే.. డిసెంబర్ 9 నుంచి వారికి ఫ్రీ జర్నీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో రాకపోకలు సాగించిన మహిళలు.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేందుకు మెుగ్గుచూపుతున్నారు. దీంతో బస్సుల్లో సీటు కాదు కదా.. కాలు పెట్టడానికి కూడా జాగా లేకుండా పోతుంది. ఈ పథకం అమల్లోకి రాక ముందు ప్రతిరోజూ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య 12 లక్షలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుంది.

Read Also : విజయ్ బాటలో విశాల్.. తమిళనాడులో పుట్టుకొస్తున్న కొత్త రాజకీయ పార్టీలు!!

జీరో టికెట్ తీసుకొని మహిళలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తుండటంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేకుండా పోయింది. ఆటోలు ఎక్కేవారే కరువయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయం తమ పొట్టే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణిలు ఎక్కకపోవటంతో తమకు రోజూవారీ ఆదాయం లేకుండా పోయిందని.. ఉపాధి లేమి తాము కుటుంబాలని ఎలా పోషించేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లు పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. ప్రభుత్వ పెద్దలను సైతం కలిశారు. తమను ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా కలిశారు.

Also Read : మరో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్.. అక్కడి నుంచే ప్రారంభం!!

ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోటవంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నెల 16న ఆటోల బంద్‌కు సిద్ధమయ్యారు. ఆ రోజు ఒక్క ఆటో కూడా రోడ్డు మీదకు రాదని డ్రైవర్లు తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్ల పూట గడవక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి :

  1. అప్పుడే మెుదలైన బానుడి బ్యాటింగ్… రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
  2. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసన సభాపక్ష నేత పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్.. రేసులో ఆ నలుగురు..!
  3. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్‌ 1లో పోస్టుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు
  4. కృష్ణా నదీ జలాల వాటపై కేసీఆర్ మరో పోరాటం.. 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ
  5. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ సస్పెండ్‌…

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.