క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ. 2లక్షల 75వేల 891 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు. మూలధన వ్యయం రూ. 29,669కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లుగా వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.33,786 కోట్లు ఉండగా.. రెవెన్యూఖాతాలో మిగులు రూ.9,031 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. మూలధన వ్యయం రూ.24,178 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.2,24, 625 కోట్లుగా పేర్కొన్నారు.
Read Also : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. మేడిగడ్డ పర్యటనకు సిద్దమౌతున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆర్థిక ఇబ్బందులున్నా ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేశామన్నారు. నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. మార్పును కోరుతూ తెలంగాణ సమాజంలో స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు. సామాజిక న్యాయం చేసి చూపిస్తామన్నారు. ప్రజాల కాంక్షలను నెరవేర్చి చూపిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10లక్షలకు పెంచామన్నారు. అర్హులైన అందరికీ ఆరు గ్యారెంటీలు అందుతాయన్నారు.
Also Read : చౌటుప్పల్లో కిడ్నాప్ ముఠా కలకలం.. కారులో వచ్చి పిల్లల్ని అపహరించేందుకు యత్నం
2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ. 2,75,891కోట్లు, ఆరు గ్యారెంటీల కోసం రూ. 53,196 కోట్లు అంచనా, పరిశ్రమల శాఖ రూ. 2,543 కోట్లు, ఐటి శాఖకు రూ. 7,74కోట్లు, పంచాయతీ రాజ్ రూ. 40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ. 11,692 కోట్లు, మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు, వ్యవసాయ శాఖ రూ. 19,746 కోట్లు, ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ. 1,250కోట్లు, ఎస్సి సంక్షేమం రూ. 21, 874 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ. 13,013 కోట్లు, మైనార్టీ సంక్షేమం రూ. 2,262 కోట్లు, బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ. 1,546 కోట్లు, బీసీ సంక్షేమం రూ. 8 వేల కోట్లు, విద్యా రంగానికి రూ. 21,389కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 5,00 కోట్లు, యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 5,00 కోట్లు, వైద్య రంగానికి రూ. 11,500 కోట్లు, విద్యుత్ – గృహ జ్యోతికి రూ. 2,418కోట్లు, విద్యుత్ సంస్థలకు రూ. 1,6825 కోట్లు, గృహ నిర్మాణానికి రూ. 7,740 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ. 28,024 కోట్లుగా ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- అడిగిన చోట బస్సు ఆపలేదని రెచ్చిపోయిన మహిళ.. కండక్టర్ పై చెప్పుతో దాడి
- బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
- తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. జాబితా విడుదల అప్పుడే!!
- రేవంత్ రెడ్డి దెబ్బకు నీరుగారిపోతున్న బీఆర్ఎస్… కేసీఆర్కు పెద్ద కష్టమే!!!
- నిర్మల్ జిల్లాలో దారుణం..ప్రియురాలిని హత్య చేసిన యువకుడు